ఎన్టీఆర్ ఇప్పుడు వరుస సినిమాలలో నటించడానికి సిద్దం అవుతున్నాడు. మాస్ యాక్షన్ తో వున్న కథల ను ఎన్టీఆర్ సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఆ సినిమాలె ఫ్యాన్స్ కు పునకాలు తెప్పిస్తున్నాయి. జనతా గ్యారేజ్ సినిమా హిట్ అవ్వడం తో ఎన్టీఆర్ పేరు మరింత పెరిగింది. ఈ సినిమా తర్వాత రాజమౌలి సినిమా తెరకెక్కిస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా లో నటిస్తూన్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా విడుదల కు సిద్ధంగా ఉంది.
సంక్రాంతికి విడుదల అవ్వాల్సిన ఈ సినిమా ఇప్పుడు వేసవి వాయిదా పడింది. ఇది నిజంగానే ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలీ. ఈ సినిమా లో కొమరం భీం పాత్ర లో ఎన్టీఆర్ నటిస్తూన్నారు. సినిమాకు ఎన్టీఆర్ పాత్ర హైలెట్ గా నిలవనంది.. ఇప్పటి వరకూ ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతితి సినిమా పై అంచనాల ను పెంచేసింది.. ఎప్పుడేప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఆశగా ఎదురు చుస్తున్నారు..ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యేలోపు తన తదుపరి చిత్రం పై ఎన్టీఆర్ దృష్టి పెట్టాలనుకుంటున్నారని తెలిసింది. '
జనతా గ్యారేజ్' వంటి హిట్ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను స్పీడప్ చేశారు దర్శకుడు కొరటాల శివ. ఫిబ్రవరిలో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెల్లాల ని డైరెక్టర్ ఆలోచన లో వున్నట్లు తెలుస్తుంది. ఆ సినిమా కథ ఎలా ఉంటుందో అని ఇప్పటి నుంచే అభిమానులకు ఆసక్తి మొదలైంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్, ఇతర కీలక పాత్రల్లో నటించనున్న నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించనున్నట్టు తెలిపారు.