కన్నడ స్టార్ హీరో యాష్, అందాల భామ శ్రీనిధి శెట్టి ల కలయికలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ కెజిఎఫ్ చాప్టర్ 1. హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై ఎంతో భారీ వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమా మూడేళ్ళ క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి అతి పెద్ద సక్సెస్ కొట్టిన విషయం తెలిసిందే. కన్నడలో తెరకెక్కిన ఈ సినిమాని రాజమౌళి సలహా మేరకు పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ చేసి భారీ సక్సెస్ అందుకున్నాము అని యూనిట్ అప్పట్లో ప్రత్యేకంగా రాజమౌళి కి కృతజ్ఞతలు తెలిపింది. ఇక ప్రస్తుతం ఆ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న సినిమా కెజిఎఫ్ చాప్టర్ 2. పార్టీ 1 ని మించేలా మరింత అద్బుతంగా భారీ వ్యయంతో తెరకెక్కుతున్న కెజిఎఫ్ చాప్టర్ 2 సినిమాపై యావత్ భారత దేశంలోని ఆడియన్స్ అందరిలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి అయిన ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అలానే మరోవైపు ప్రభాస్ తో సలార్ అనే పాన్ ఇండియా సినిమాని ప్రశాంత్ నీల్ తీస్తున్న విషయం తెల్సిందే. అయితే దీని తరువాత ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఒక మూవీ ఓకె చేసారు దర్శకుడు ప్రశాంత్ నీల్. మైత్రి మూవీ మేకర్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ కొన్ని నెలల క్రితం వచ్చింది. కాగా అది మాత్రమే కాక ఇటీవల మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి కూడా ఒక పవర్ఫుల్ స్టోరీ వినిపించిన ప్రశాంత్ నీల్, త్వరలో దాని స్క్రిప్ట్ పూర్తి కాగానే అఫీషియల్ గా అనౌన్స్ చేయడానికి సిద్ధం అవుతున్నట్లు టాక్.
అయితే అసలు విషయం ఏమిటంటే, ఈ రెండు సినిమాల్లో ముందుగా ఎవరి సినిమా మొదలెట్టాలి అనే విషయమై ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఒకింత డైలమాలో ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ తో సినిమా చేస్తుండగా, త్వరలో కొరటాల శివతో తన నెక్స్ట్ సినిమాని మొదలుపెట్టనున్నారు ఎన్టీఆర్. కాగా ఈ సినిమాల తరువాతనే ఇద్దరూ ప్రశాంత్ నీల్ సినిమా చేయాలని భావిస్తున్నారని, మరి వీరిద్దరిలో ఎవరితో ప్రశాంత్ ముందుగా సినిమాని చేస్తారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. మరి దీనిపై పూర్తిగా క్లారిటీ రావాలి అంటే మరికొన్నాళ్లు వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.