సరికొత్త మూవీకి శ్రీకారం చుట్టనున్న అల్లరి నరేష్..!!

Divya
ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అల్లరి సినిమా ద్వారా అడుగుపెట్టిన నరేష్ .. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకోవడంతో ఇక ఈ సినిమాతో కలిపి ఆయనను అల్లరి నరేష్ అని పిలవడం మొదలు పెట్టారు. ఇక అలా మొదటి సినిమాతోనే కామెడీ హీరో గా ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత అన్నీ కూడా కామెడీ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడు. అయితే కామెడీ జోనర్లో ప్రేక్షకులు ఎంతో కాలం హీరోలను ఆదరించ లేరని ఈయనను చూస్తే అర్థమవుతుంది. అందుకే వరుస ప్లాపుల ను చవి చూస్తూ పూర్తిగా ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చింది.


దాదాపు 8 సంవత్సరాల పాటు వరుస ఫ్లాపులతో ఇండస్ట్రీకి దూరమైన అల్లరినరేష్ 2021 సంవత్సరపు తొలినాళ్ళలో నాంది సినిమా ద్వారా ప్రేక్షకులకు తనలో ఉన్న కామెడీ ని పక్కనపెట్టి సీరియస్ నటనతో అల్లరినరేష్ లో ఈ కోణం కూడా ఉందని అందరూ ఆశ్చర్యపోయేలా తన నటనతో అందరిని మెస్మరైజ్ చేశాడు. ఈ సినిమాతో పూర్తిస్థాయిలో విజయాన్ని అందుకొని మళ్లీ ఇప్పటికీ ఒక సినిమా కథను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తన కొత్త సినిమా అంటే అల్లరి నరేష్ తన 59వ సినిమాను ఏ ఆర్ మోహన్ దర్శకత్వంలో చేయడానికి సిద్ధమవుతున్నాడు.

అంతే కాదు ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలను కూడా ఈ రోజు పూర్తి చేయనున్నట్లు సమాచారం. నాంది  సినిమా తర్వాత ఏకంగా సంవత్సర కాలం గ్యాప్ తీసుకున్న అల్లరి నరేష్ ఇప్పుడు ఈ కొత్త సినిమాతో మరింత సక్సెస్ ను అందుకుంటాడు అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక పోతే వీరి తండ్రి ఈ వి వి సత్యనారాయణ ఎంతోమంది హీరోలకు మంచి సక్సెస్ అందించిన విషయం అందరికీ తెలిసిందే . రాజేంద్ర ప్రసాద్ ని మొదులుకొని చిరంజీవి వరకు ఇలా చాలా మంది స్టార్ హీరోలుగా సక్సెస్ అయ్యారు అంటే ఈయన డైరెక్షన్లోనే వారంతా సక్సెస్ సాధించగలిగారు అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: