NBK107: ఫ్యాన్స్ కి ట్రిపుల్ ట్రీట్ ఇవ్వనున్న బాలయ్య..?
రాయలసీమ - కర్ణాటక బోర్డర్ నేపథ్యంలో కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. సినిమాలో బాలకృష్ణ ట్రిపుల్ రోల్ లో కనిపించనున్నారంటూ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఇటీవల విడుదలైన అఖండ సినిమా తో సహా గతంలో బాలయ్య నటించిన చాలా సినిమాల్లో ఆయన డ్యూయల్ రోల్ చేసి మెప్పించారు. అయితే బాలకృష్ణ మూడు పాత్రల్లో నటించి మాత్రం చాలా కాలమే అవుతోంది. సుమారు పది సంవత్సరాల క్రితం 'అధినాయకుడు' అనే సినిమాలో మూడు పాత్రల్లో కనిపించిన బాలయ్య మళ్లీ ఇన్నాళ్లకి అభిమానులకు తన 107 వ సినిమా ద్వారా ట్రిపుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడట.
ప్రస్తుతం ఈ వార్త తో బాలయ్య ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే బాలయ్యను మూడు పాత్రల్లో గోపీచంద్ మలినేని ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ సినిమాలో బాలయ్య ఒక పాత్రలో ఫ్యాక్షనిస్ట్ గా మరో పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక వీటితో పాటు మరొక పాత్రలో స్వామిజి అవతారం లో బాలయ్య కనిపించనున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేకపోయినా.. ఈ వార్త మాత్రం ఫిల్మ్నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది...!!