ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం స్టార్ దర్శకులు అందరూ కూడా పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే.కానీ ఎప్పటి నుంచో మంచి దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం పాన్ ఇండియా సినిమాలు కాకుండా తెలుగులోనే పెద్ద సినిమాలను చేసేందుకు ఇష్టపడుతున్నాడు. పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు ఆయన ఆసక్తి చూపించకపోవడం ఆశ్చర్యకరమైన విషయం అయితే. త్రివిక్రమ్ శ్రీనివాస్ గతంలో మంచి హిట్లు అందుకున్నప్పటికి కూడా అవి కాపీ ఆరోపణలు అని వచ్చాయి.
ఇక సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగిన తర్వాత ఈ దర్శకుడు చాలా రకాల ట్రోల్స్ కు కూడా గురయ్యాడు. ఈ రోజుల్లో హాలీవుడ్ సినిమాలను కాపీ కొట్టి సినిమాలు తీయడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. నిమిషాల్లోనే కనిపిట్టేసస్తున్న ఆడియన్స్ అవసరమైతే కడిగి పారేస్తున్నారు. ఇక మొత్తానికి అల వైకుంఠ పురంలో సినిమాతో మంచి హిట్ దక్కించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమా కోసం మళ్లీ మూడవసారి కూడా పూజా హెగ్డేను సెలెక్ట్ చేసుకోవడం అనేది ఇక ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక విధంగా మూడు అనే సెంటిమెంట్ ను చాలా బలంగా నమ్ముతున్నట్టు ఇంకా దాన్ని కొనసాగిస్తున్నట్లు పూర్తిగా అర్థమవుతోంది. అందుకే ఇదివరకే సమంతతో వరుసగా మూడు సినిమాలు చేసిన విషయం తెలిసిందే. అత్తారింటికి దారేది సన్నాఫ్ సత్యమూర్తి అ ఆ సినిమాలు చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సమంతను విభిన్నంగా చూపించి మంచి హిట్లను అందుకున్నాడు. ఇక పూజ హెగ్డేను కూడా అదే తరహాలో త్రివిక్రమ్ కొనసాగిస్తున్నాడు. సో త్రివిక్రమ్ పూజా హెగ్డేనే పదే పదే తీసుకోవడానికి కారణం ఇదనమాట.
ఇక జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన అరవింద సమేత అల్లు అర్జున్ తో చేసిన అల వైకుంఠ పురములో సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజ హెగ్డేనే నటించింది. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో కూడా ఆమెనే హీరోయిన్ గా ఫైనల్ చేశాడు త్రివిక్రమ్. దీంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ సినిమాతో మంచి హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయమట..