పూరి ఆ కలల ప్రాజెక్ట్ నిజమవుతుందా?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి సూపర్ స్టార్ మహేష్ 'పోకిరి' సినిమా తరువాత ఆ రేంజ్ సౌత్ ఇండియా ఇండస్ట్రీ హిట్ అనేది లేదు. ఇక ప్రస్తుతం పూరి యంగ్ హీరో విజయ్‌ దేవరకొండతో `లైగర్‌` అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు.ముంబయి చాయ్‌ వాలా ఏకంగా వరల్డ్ బాక్సర్‌గా ఎదగడం అనే నేపథ్యంలో సాగే చిత్రమిది. పాన్‌ ఇండియా సినిమాగా దీన్ని తెరకెక్కిస్తుండగా, ఇందులో బాలీవుడ్‌ హాట్ అండ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తుంది. ఇందులో వరల్డ్ బాక్సర్‌ మైక్‌ టైసన్‌ కూడా మంచి కీ రోల్‌ పోషిస్తుండటంతో సినిమా రేంజ్‌ కూడా మారిపోయింది. ఇక ఈ సినిమా ఆగస్ట్ 25 వ తేదీ న విడుదల కాబోతుంది.ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ని ప్రకటించాడు పూరీ జగన్నాథ్. మళ్ళీ మరోసారి విజయ్‌ దేవరకొండతో `జనగణమన` సినిమాని చేయబోతున్నట్టు తెలిపాడు పూరి. ఇది కూడా పాన్‌ ఇండియా రేంజ్‌లో ఉంటుందని చెప్పాడు పూరి.


ఇక ఇదిలా ఉంటే తాజాగా దర్శకుడు పూరీ జగన్నాథ్ మరో సెన్సేషనల్‌ ప్రాజెక్ట్ ని ప్రకటించడం జరిగింది. అయితే ఇది పాన్‌ ఇండియా సినిమా మాత్రమే కాదు. ఏకంగా పాన్‌ వరల్డ్ సినిమా అని సమాచారం తెలుస్తుంది. `జనగనమన` తరువాత ఇంటర్నేషనల్‌ సినిమా  చేయబోతున్నాడట పూరీ జగన్నాథ్.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఇందులో అంతర్జాతీయ తారాగణం కూడా ఉంటుందట. టెక్నీషియన్లు కూడా విదేశాలకు చెందిన వారే ఉంటారని సమాచారం తెలుస్తుంది. అయితే ఈ సినిమాని కూడా తన పూరీ కనెక్ట్ ఇంకా అలాగే పూరీజగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకాలపైనే నిర్మించబోతుండటం విశేషం.


ప్రస్తుతం ఈ వార్త అన్ని సోషల్ మీడియా సైట్ లలో తెగ ట్రెండ్‌ అవుతుంది. `లైగర్‌` సినిమా రిలీజ్‌కి ముందే మంచి పాజిటివ్‌ టాక్‌ని తెచ్చుకుంది. ఆ మధ్య విడుదలైన టీజర్‌ కూడా ఆద్యంతం ఆకట్టుకుంది. ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. దీంతో తనపై తనకు మంచి కాన్ఫిడెంట్‌ అనేది వచ్చింది. ఇక ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌పై పూరీ జగన్నాథ్ కన్నేసినట్టు తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.లెట్స్ వెయిట్ అండ్ సీ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: