"రాధేశ్యామ్" నుండి బిగ్ అప్డేట్... వీడియో సాంగ్ రిలీజ్?
అయితే కరోనా కారణంగా థియేటర్ కు అందుంటులో లేకపోవడంతో పలు సార్లు రిలీజ్ తేదీలు ప్రకటించినా విడుదల చేసే దైర్యం చేయలేకపోయింది చిత్ర బృందం. ఈ సినిమా ఒక అద్భుతమైన పీరియాడికల్ ప్రేమకథగా తెరకెక్కింది. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా పాపులర్ హీరోయిన్ పూజ హెగ్డే నటించింది. రాధాకృష్ణ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతను భుజాన వేసుకున్నాడు. ఈ సినిమాను ప్రేక్షకులలోకి తీసుకెళ్ళడానికి చిత్ర బృందం ప్రమోషన్ ను మొదలు పెట్టింది. ఇప్పటి వరకు సినిమా నుండి విడుదల అయిన టీజర్, పాటలు ప్రేక్షకుల్ని అంతగా రంజింప చేయడంలో విఫలం అయ్యాయి.
అందుకే ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు అని ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం అందుతోంది. కాగా ఇప్పుడు మరో అప్డేట్ ను ప్రభాస్ అభిమానులకు అందించడానికి సిద్దం అయింది మూవీ టీమ్. ఈ సినిమా నుండి "ఈ రాతలే ...." అంటూ సాగే పాట వీడియో సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఇంకాసేపట్లో ఈ సాంగ్ యొక్క పూర్తి వీడియోను విడుదల చేయనుంది. సరిగ్గా ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ముహూర్తం పెట్టింది చిత్ర బృందం. మరి వీడియో సాంగ్ అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా చూడాలి.