సూపర్ స్టార్ మహేష్ బాబు ,డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో 'సర్కారు వారి పాట' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా నుంచి ఇటీవల వాలెంటైన్స్ డే సందర్భంగా మొదటి పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కళావతి అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం ఒక ఊపు ఊపేస్తోంది. యూట్యూబ్ మొత్తాన్నే షేక్ చేస్తోంది.తాజాగా ఈ పాట యూట్యూబ్ లో 50 మిలియన్స్ కు పైగా వ్యూస్ ను క్రాస్ చేసినట్లు మూవీ యూనిట్ తెలిపింది. అంతేకాదు అలాగే 1.3 మిలియన్స్కు పైగా లైక్స్ సాధించింది.అయితే ఈ ఘనతపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్, డైరెక్టర్ పరుశురామ్, సింగర్ సిద్ శ్రీరామ్ హర్షం వ్యక్తం చేశారు.
అయితే మొత్తానికి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది కళావతి.అంతేకాకుండా ఈ పాటకు సోషల్ మీడియా లో సైతం భారీ రెస్పాన్స్ వస్తోంది. కాగా నిజానికి మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన ఈ పాట సోషల్ మీడియాలో లీకైంది.అయితే సోషల్ మీడియాలో మొత్తం పాట వైరల్ కూడా అయ్యింది. ఇక దాంతో ఇక ఈ పాట హిట్ కాదు అనుకున్నారు. కాగా ఆ కోపంలోనే సైబర్ క్రైమ్ పోలీసులకు SVP యూనిట్ ఫిర్యాదు కూడా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతంఈ పాటకు పైరసీ బెడద గట్టిగానే తగిలినా.. ఈ పాట మాత్రం ఓ ఊపు ఊపేస్తోంది.
కాగా పైగా ఇప్పటికే ఈ పాట మరో రికార్డును కూడా తన పేరిట లిఖియించుకుంది.అయితే యూట్యూబ్లో అత్యంత వేగంగా 70 లక్షలకు పైగా వ్యూస్, 500Kకు పైగా లైకులను సంపాదించిన పాటగా కూడా కొత్త రికార్డును సెట్ చేసింది. ఇకపోతే మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాకి పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న కాగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. మహేష్ కు విలన్ గా టాలీవుడ్ అగ్ర నటుడు సముద్రఖని నటిస్తున్న ఈ సినిమా వేసవి కానుకగా మే 12న విడుదల కానుంది...!!