సూర్యను జై భీమ్ వివాదం ఇంకా వెంటాడుతూనే ఉందా..!!
జై భీమ్ చిత్రంలో వన్నియర్ వర్గాల నేతలు గతంలో ఈ సినిమాపై విరుచుకుపడ్డారు.. మరికొంతమంది నేతలు ఒక అడుగు ముందుకు వేసి తమ వర్గాన్ని కించపరిచారంనట్లుగా సూర్య ను విమర్శించారు. ఇదంతా పీఎంకే నేతలు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం సూర్య నటిస్తున్న ఈటి చిత్రానికి కూడా అడ్డు పడుతున్నట్లుగా సమాచారం. జై భీమ్ సినిమా లోని ఎన్నో సన్నివేశాలలో.. వన్నియర్ వర్గాలని కావాలనే అవమానించారని ఆ నేతలు తెలియజేయడం జరిగింది. ఇక అంతే కాకుండా అందుకోసం నష్టపరిహారంగా 5 కోట్ల రూపాయలు చెల్లించాలని .. జై భీమ్ చిత్రనిర్మాత కు నోటీసు కూడా పంపించారు వన్నియర్ వర్గం వారు.
అయితే ఇప్పుడు తాజాగా జై భీమ్ వివాదంపై సూర్య ఏ విధంగా క్షమాపణలు చెప్పకపోవడంతో పాటు 5 కోట్ల నష్టపరిహారం కూడా చెల్లించలేదని PMK పార్టీ అధినేతలు తెలియజేస్తున్నారు. సూర్య ఈ విధంగా చేయడంతో ఆ సినిమాని నిషేధించాలని కోరుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం సూర్య నటిస్తున్న ET చిత్రానికి కూడా ఈ పార్టీ నేతలు చాలా ఇబ్బంది పెడుతున్నట్లు గా సమాచారం. మరి సూర్య స్పందిస్తాడేమో చూడాలి మరి.