రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను యు.వి.క్రియేషన్స్ వారు దాదాపుగా మూడు వందల కోట్ల బడ్జెట్ తో నిర్మించడం జరిగింది. ఈ విషయాన్ని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మూడు వందల కోట్ల బడ్జెట్ సినిమా అంటే ఖచ్చితంగా ఆ రేంజ్ బిజినెస్ అనేది అవ్వాల్సిందే. ప్రభాస్ సినిమా అవ్వడం వల్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా దెబ్బకు అంతకు మించి అన్నట్లుగా జరిగింది అంటూ వార్తలు అనేవి వస్తున్నాయి. అలాగే నిర్మాతల కు లాభాలు దక్కే విధంగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అవ్వడం జరిగింది.ఇక ఈ సినిమా దాదాపు రూ. 205 కోట్ల థియేట్రికల్ రైట్స్ ని దక్కించుకోవడం అనేది జరిగింది.
కేవలం తెలుగు రాష్ట్రాల్లో 105 కోట్లు బిజినెస్ చేసిందని సమాచారం. ఇక ఈ సినిమా దాదాపు గా 200 కోట్ల నాన్ థియేట్రికల్ బిజినెస్ అనేది చేసింది. సినిమా విడుదల కు ముందే నిర్మాత కు రూ. 400 కోట్ల కు పైగా ఆదాయం వచ్చినట్లయిందట. ఇక రూ. 210 కోట్లు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ సాధించినట్లుగా సమాచారం అనేది తెలుస్తుంది. ఇక మొదటి వారం లేదా పది రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని చాలా నమ్మకం తో మూవీ మేకర్స్ ఉన్నారు.ప్రభాస్ స్టార్ డమ్ ఇంకా ఆయన ఛరిష్మా నేపథ్యం లో మంచి భారీ వసూళ్లు నమోదు కావడం ఖాయం. కాబట్టి ఈ సినిమా చాలా తక్కువ సమయంలోనే బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేస్తుందని అంతా కూడా నమ్ముతున్నారు.రెబల్ స్టార్ ప్రభాస్ ప్రతిష్టాత్మక సినిమా అవ్వడం తో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా సాహో వసూళ్లను కూడా బ్రేక్ చేస్తుంది అంటూ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో నమ్మకం తో ఎదురు చూస్తున్నారు.