ఆచార్య : అభిమానులకు మెగా మాస్ ఫీస్ట్ రెడీ!

Purushottham Vinay
మెగాస్టార్ చిరంజీవి  ఇంకా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ''ఆచార్య'' సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ఫస్ట్ టైం మెగా తండ్రీకొడుకులు స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు,గ్లిమ్స్ ఇంకా టీజర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. అలానే 'లాహే లాహే' 'నీలాంబరి' 'సానా కష్టం' పాటలు అయితే శ్రోతలను విశేషంగా అలరించాయి.'ఆచార్య' సినిమాని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 29 వ తేదీన విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే రెగ్యులర్ గా ఈ సినిమా నుండి అప్డేట్స్ అనేవి లేకపోవడంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఇక ఉగాది పండగ సందర్భంగా ఏదైనా అప్డేట్ ఉంటుందని ఫ్యాన్స్ ఆశించారు.




ఇక ఈ నేపథ్యంలో ఆచార్య మేకర్స్ ట్రైలర్ కు సంబంధించిన అప్డేట్ తో ఫ్యాన్స్ ముందుకు వచ్చారు. రాబోయే రోజుల్లో అగ్రిసివ్ గా ప్రమోషనల్ కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్న సినిమా బృందం.. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. త్వరలోనే మెగా మాస్ ఫీస్ట్ అనౌన్స్ మెంట్ ఉంటుందని వీడియో ద్వారా వెల్లడించారు.ఇక 'ఆచార్య' సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే సందడి చేయనుంది. రెజీనా కాసాండ్రా -  స్పెషల్ సాంగ్ లో కనిపించగా.. సోనూసూద్, జిషు సేన్ గుప్తా,వెన్నెల కిశోర్,పోసాని కృష్ణ మురళి,తనికెళ్ళ భరణి, సౌరవ్ లోకేష్ - అజయ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: