ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ గ్రౌండ్ తో పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న పుష్ప మూవీ గత ఏడాది డిసెంబర్ 16న తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ అయ్యింది. ఎర్రచందనం సిండికేట్ లోని ఒక కూలీ ఆ వ్యాపరంలో డాన్ గా ఎలా ఎదిగాడనేదే ఈ సినిమా స్టోరీ. ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ.. ప్రమోషన్స్ వల్ల ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టి సూపర్ హిట్ అయ్యింది.అయితే ఇప్పుడు 'పుష్ప ది రైజ్' సినిమాకు కొనసాగింపుగా పార్ట్ 2 'పుష్ప ది రూల్' రాబోతోంది. ఏప్రిల్ నెల నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని మొదట ప్రచారం జరిగింది. కానీ పుష్ప మూవీ టీం షూటింగ్ ప్లాన్ ను మార్చేసిందట. ఏప్రిల్ నెల నుంచి కాకుండా జూన్ నెల మొదటి వారంలో సెకెండ్ పార్ట్ రెగ్యులర్ షూట్ షురూ చేయాలని మూవీ టీం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.అయితే ఉన్నట్లుండి పుష్ప షూట్ ని ఆలస్యం చేయడం వెనక కారణమేంటి అన్నది ఆసక్తికరంగా మారగా.. ఓ ఇంట్రస్టింగ్ టాక్ నెట్టింట వైరల్ అవుతూ తెగ చక్కర్లు కొడుతోంది.
ఇక అదేంటంటే.. రాజమౌళి కారణంగానే పుష్ప 2 సినిమా ఆలస్యం అవుతుందట. ఈయన తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఇటీవలె విడుదలై పాన్ ఇండియా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే.ప్రతి సీన్ లోనూ ఇంకా అలాగే ప్రతి పాటలోనూ ప్రతి ఫైట్లోనూ రాజమౌళి పెర్ఫెక్షన్ స్పష్టంగా కనిపించింది. విజువల్స్ యాక్షన్ సీన్లు ఇంకా అలాగే హీరోల ఎంట్రీ ఇందులో హైలైట్గా నిలిచాయి.ఇక ఇప్పుడు ఈ సినిమా 'పుష్ప 2' సినిమాకు అతి పెద్ద సవాల్ లాగా మారింది. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ సుకుమార్ పార్ట్ 2 స్క్రిప్ట్ కు మరింత మెరుగులు దిద్దే పనిలో పడ్డారట. అల్లు అర్జున్ హీరోయిజం ఊహించిన ట్విస్ట్ లు అదిరిపోయే యాక్షన్ సీన్ లతో పుష్ప ది రూల్ ను పీక్స్ కు తీసుకెళ్లాలని భావిస్తున్నారట. అందుకే ఏ హడావుడి లేకుండా సినిమాను రూపొందించాలని సుకుమార్ ఫిక్స్ అయినట్లు టాక్ నడుస్తోంది.