తెలుగు ప్రమోషన్స్ కి విజయ్ నాట్ ఇంట్రెస్టెడ్.. బద్ధకమా లేక చిన్న చూపా?

Purushottham Vinay
తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ సినిమా 'బీస్ట్'. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించారు. టాలీవుడ్ హాట్ హీరోయిన్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం తమిళంలో పాటు తెలుగు మలయాళ కన్నడ హిందీ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.విజయ్ సినిమాలకు గతంలో తెలుగులో పెద్దగా మార్కెట్ వుండేది కాదు కానీ ఈమధ్య గడిచిన కొన్నేళ్లుగా ఆయన సినిమాలకు మంచి మార్కెట్ అనేది క్రియేట్ అయింది. తుపాకి, పోలీసోడు,  సర్కార్,అదిరింది ఇంకా మాస్టర్ వంటి సినిమాలకు తెలుగులో మంచి వసూళ్లు దక్కాయి. అలాగే విజయ్ కి మంచి మార్కెట్ కూడా ఏర్పడింది. దీంతో విజయ్ నటించిన తాజా సినిమా 'బీస్ట్' పై కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ అనేది ఏర్పడింది. దీంతో ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ రావడం కాయం అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.ఇక ఇదిలా వుంటే ఈ సినిమా ప్రచారానికి రావడానికి మాత్రం విజయ్ అస్సలు ఇష్టపడటం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తనకు హ్యూజ్ క్రేజ్ ఏర్పడినా విజయ్ మాత్రం తెలుగు ప్రేక్షకుల్ని లెక్కచేయకపోవడం చాలా మందిని కోపానికి గురిచేస్తోంది.

తెలుగు ప్రేక్షకులు ఆయనపై తమ అభిమాన్ని కురిపిస్తున్నా విజయ్ మాత్రం పెద్దగా పట్టించుకోకుండా లైట్ తీసుకోవడం కోపం తెప్పిస్తుంది. ఇతర భాషలకు చెందిన హీరోలు తెలుగులో తమ సినిమా రిలీజ్ అవుతోందంటే ఖచ్చితంగా ప్రమోషన్స్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పర్యటిస్తున్నారు.కాని విజయ్ మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రర్తిస్తున్నాడు. తెలుగు 'బీస్ట్' రిలీజ్ ప్రమోషన్స్ కోసం హీరోయిన్ పూజా హెగ్డే దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ సంగీత దర్శకుడు అనిరుధ్ తో పాటు ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్న దిల్ రాజు మాత్రమే పాల్గొన్నారు. విజయ్ అటెండ్ కావడానికి ఆసక్తి చూపించకపోవడం వల్లే హీరోయిన్ డైరెక్టర్ తెలుగు వెర్షన్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి.ఆర్ ఆర్ ఆర్, పుష్ప లాంటి నేషనల్ హిట్ సినిమాల రిలీజ్ టైమ్ లో మన హీరోలు దేశ వ్యాప్తంగా వున్న ప్రధాన నగరాల్లో పర్యటించి తమ సినిమాని ప్రమోట్ చేసుకున్నారు. తమిళ వెర్షన్ ప్రచారం కోసం చెన్నై కూడా వెళ్లి ప్రత్యేకంగా మీడియా తో వారు ఇంటరాక్ట్ అయ్యారు. అయితే విజయ్ మాత్రం హైదరాబాద్ రావడానికి బద్దకించడం ఇప్పడు చాలా చర్చనీయాంశంగా మారింది.ఇక అంతే కాకుండా ఇటీవల లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన విజయ్ ఇంకా వంశీ పైడిపల్లిల బై లింగ్వల్ సినిమా కూడా చెన్నైలోనే పూజాకార్యక్రమాలతో ప్రారంభించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: