రణబీర్-అలియా వివాహానికి గెస్ట్లు వీళ్ళే!

Purushottham Vinay
బాలీవుడ్ లవ్లీ కపుల్ రణబీర్ కపూర్-అలియాభట్ వివాహ బంధంతో ఒకటవ్వడానికి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు తమ ప్రేమ బంధానికి పుల్ స్టాప్ పెట్టి భార్యభర్తలుగా ఏడు అడుగులు వేయడానికి రంగం రెడీ చేస్తున్నారు.ఇక అన్ని రకాల పుకార్లకు పుల్ స్టాప్ పెట్టేసి నవ దంతపతుల్లా వీళ్ళు ఆకర్షించబోతున్నారు. పెళ్లి తేది ఇంకా పక్కాగా బయటకు రాలేదు కాని ఈ వారంలో పెళ్లి భాజాలు ఖచ్చితంగా మ్రోగడం ఖాయంగా కనిపిస్తుంది.ఏప్రిల్ 13 నుంచి 17 తేదీల్లో వివాహ వేడుకలకు రంగం సిద్దమవుతున్నట్లు మాచారం. ఉదయాన్నే ఉదయం 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో రణబీర్ ప్రియురాలి మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు. మెహందీ,సంగీత్ ఇంకా కాక్ టెయిల్ పార్టీ వేడుకలు చెంబూరులోని ఆరే. కే స్టూడియోలో ఘనంగా రెడీ చేస్తున్నారు. దానికి సంబంధించి ఆర్ కే స్టూడియో కూడా ముస్తాబవుతుంది.


ఇక పెళ్లి వేదిక అనేది ముంబై బాంద్రాలోని రణబీర్ కపూర్ ఇంట్లో వైభంగా జరగనుంది. తండ్రి రిషి కపూర్ కోరిక ప్రకారం ఊరంత కూడా పందిరేసి భారీ ఎత్తున వివాహాన్ని అక్కడే జరిపించాలని నిర్ణయించడంతో వేదిక అదే అని తెలుస్తోంది. ఇక ఈ వివాహానికి బాలీవుడ్ నుంచి సంజయ్ లీలా భన్సాలీ, అర్జున్ కపూర్,ఆయాన్ ముఖర్జీ,జోయా అక్తర్ ఇంకా అలాగే సైఫ్ అలీఖాన్ తదితరులు హాజరవుతున్నట్లు సమాచారం తెలుస్తుంది.ఇక పెళ్లి తరువాత ఈ జంట సెలబ్రిటీలు, పారిశ్రామిక ఇంకా రాజకీయ వేత్తల కోసం భారీ ఎత్తున ముంబైలోని తాజ్ మహల్ ప్యాలస్ లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. పార్ట్ -5 స్టార్ హోటల్ బాల్ రూమ్ లో రాత్రి 9 గంటల కు రిసెప్షన్ అనేది స్టార్ట్ కానుందని సమాచారం తెలుస్తుంది.అలియాభట్, రణబీర్ కపూర్ వివాహానికి దాదాపు 200 మంది బౌన్సర్లతో ప్రత్యేక భద్రతని ఏర్పాటు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి ఏర్పాట్లు గత నెల రోజులుగా జరుగుతున్నాయి. ఇక వివాహం తరువాత హానీమూన్ కి ఆఫ్రికా వెళ్లనున్నారని సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: