"ఆచార్య" కు శుభవార్త.. టికెట్ ధరలు పెంపు?

VAMSI
టాలీవుడ్ ఇంస్ట్రీలో నాణ్యమైన సినిమాలను అందిస్తూ ఇండియన్ సినిమాలో తమ కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఇందుకు మంచి కథలను తీసుకునే డైరెక్టర్ నుండి సినిమా పూర్తయ్యాక గుమ్మడికాయ కొట్టే ప్రతి ఒక్కరు వరకు కారణం అని చెప్పాలి. కరోనా లాంటి సంక్షోభం తర్వాత మానవుని మనుగడ పై ప్రశ్న ఎదురయింది. కానీ దాని నుండి కూడా పోరాడి మనము మళ్ళీ యధావిధిగా మన బ్రతుకులు సాగించుకుంటున్నాము. గత సంవత్సరం నుండే సినిమా ఇండస్ట్రీ కుదుటపడింది అని చెప్పాలి. అవి కూడా చిన్న సినిమాలు రిలీజ్ అయి పెద్ద సినిమాలకు ధైర్యాన్ని ఇచ్చాయని చెప్పాలి. ఆ తరువాత క్రాక్, పుష్ప, అఖండ, రాధేశ్యామ్, ఆర్ ఆర్ ఆర్ మరియు కేజీఎఫ్ లాంటి సినిమాలు రిలీజ్ అయి ప్రేక్షకులను థియేటర్ లకు రప్పించి కలెక్షన్ లు సాధించాయి.

ఇప్పుడు అదే విధంగా మరొక్క సినిమా ఈ వారం విడుదల కావడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉంది. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లలో ఒకరైన కొరటాల శివ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఆచార్య గా మెగాస్టార్ చిరంజీవి ఈ శుక్రవారం రానున్నాడు. ఇందులో మెగా పవర్ స్టార్ పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ సిద్దాగా ప్రేక్షకులను అలరించనున్నాడు. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. అదేమిటో తెలుసా... సినిమా కలెక్షన్ లను దృష్టిలో ఉంచుకుని... టికెట్ ధరలను పెంచింది... అది కూడా కేవలం వారం రోజుల వరకు మాత్రమే పరిమితి ఇచ్చింది. ఏప్రిల్ 29 నుండి మే 5 వరకు పెరిగిన టికెట్ ధరలు అందుబాటులో ఉండనున్నాయి.

మల్టీ ప్లెక్స్ లలో టికెట్ మీద 50 రూపాయలు మరియు మిగిలిన థియేటర్ లలో ౩౦ రూపాయలు పెంచుకోవచ్చు అని తెలిపింది. ఇక రోజుకు అయిదు షో లు కూడా వేసుకోవచ్చు అని తెలంగాణ ప్రభుత్వం ఆచార్య టీమ్ కు లడ్డూ లాంటి వార్త చెప్పి సర్ప్రైజ్ చేసింది. ఈ వార్త విన్న చిత్ర బృందం మరియు మెగాస్టార్ అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: