ఢీ షోలో వెక్కి వెక్కి ఏడ్చిన ప్రియమణి.. ఎందుకో తెలుసా?
అదే సమయం లో అతి బుల్లితెర ప్రేక్షకుల అందరికీ కూడా దగ్గరయ్యేందుకు ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ అనే కార్యక్రమం లో జడ్జిగా అవతారమెత్తింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తనదైన జడ్జిమెంట్ తో అటు బుల్లితెరపై కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంటుంది. అయితే ఇటీవలే వచ్చేవారం ఢీ షో ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ప్రోమోలో భాగంగా ప్రియమణి వెక్కివెక్కి ఏడ్చింది అని చెప్పాలి.
సాధారణం గా ఢీ స్టేజిపై ఎంతోమంది బయోపిక్ ని డాన్స్ పెర్ఫార్మెన్స్ రూపం లో చేసి చూపిస్తారు. ఈ క్రమం లోనే ఇటీవల ప్రియమణి లైఫ్ ఎలా సాగింది అనే విషయాన్ని పర్ఫామెన్స్ చేసి చూపించారు. ఈ పర్ఫామెన్స్ ప్రియమణికి ఎంతగానో కనెక్ట్ అయి పోయింది. ఇక పర్ఫామెన్స్ పూర్తయిన తర్వాత ప్రియమణిని స్టేజి మీదికి పిలిచి ఒక గిఫ్టు ఇస్తారు. ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి ఫోటో చూడగానే ప్రియమణి ఒక్కసారిగా కన్నీళ్ళు పెట్టుకుంటుంది. వెక్కివెక్కి ఏడుస్తోంది. దీంతో అభిమానులు అందరూ కూడా షాక్ అవుతారు.