వార్నీ : రాజమౌళి మూవీ గురించి ... మహేష్ అంతమాట అన్నారేంటి .... ??

GVK Writings
సూపర్ స్టార్ మహేష్ ఇటీవల భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు మూవీస్ భారీ విజయాలతో వరుసగా మూడు సక్సెస్ లు సొంతం చేసుకుని హ్యాట్రిక్ కొట్టిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న సర్కారు వారి పాట మూవీ పై అందరిలో విపరీతంగా అంచనాలు ఉన్నాయి. మహేష్ కి జోడీగా కీర్తి సురేష్ నటించిన ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా పరశురామ్ పెట్ల మూవీని తెరకెక్కించారు. మరొక రెండు రోజుల్లో సర్కారు వారి పాట ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.
ఇక దీని తరువాత వచ్చే నెలలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ సంస్థ వారు నిర్మించనున్న భారీ ప్రతిష్టాత్మక సినిమాలో నటించనున్నారు మహేష్ బాబు. దీనికి కూడా తమన్ సంగీతం అందించనుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పై కూడా అందరిలో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే ఈ రెండిటి అనంతరం దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తో ఒక భారీ పాన్ ఇండియా మూవీ చేయనున్నారు సూపర్ స్టార్. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ఎంతో భారీ వ్యయంతో నిర్మించనున్న ఈ సినిమా కోసం ఎప్పటినుండో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహేష్ ఫ్యాన్స్ తో పాటు అన్ని భాషల ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ సినిమా గురించి నేడు సర్కారు వారి పాట ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ బాబు మాట్లాడారు. రాజమౌళి గారితో సినిమా అంటే రెండు నుండి మూడేళ్లు సమయం పడుతుంది కదా దీని పై మీ అభిప్రాయం ఏంటని ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు మహేష్ సమాధానం ఇస్తూ, రాజమౌళి గారితో ఒక సినిమా చేయడం అంటే పాతిక సినిమాలు చేసినట్లే, తప్పకుండా ఆ మూవీ రిలీజ్ తరువాత నా ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆనందంగా ఫీల్ అవుతారు అని చెప్పారు మహేష్. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో సెట్స్ మీదకు వెళ్లనుండగా 2026 లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు టాక్.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: