సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటించిన సర్కారు వారి పాట సినిమా మే 12 వ తేదీన విడుదల కాబోతున్న విషయం మామా అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ సినిమా ప్రమోషన్ లలో ఫుల్ బిజీ గా సమయాన్ని గడుపుతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు పలు టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లలో , సోషల్ మీడియా ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ మూవీ ని ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ లలో ఫుల్ బిజీగా ఉన్నా మహేష్ బాబు తాజాగా 'ద పీకాక్' మేగజీన్ కవర్ పేజీపై కనిపించి అభిమానులను ఫుల్ ఖుషీ చేశారు.
ద పీకాక్ మేగజీన్ కవర్ పేజీపై తను ఉన్న ఫొటోను స్వయంగా మహేశ్ బాబు తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తన ఫొటోలు కవర్ పేజీపై ప్రచురించినందుకు ద పీకాక్ మేగజీన్కు మహేష్ బాబు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఫొటో కోసం జరిగిన షూట్ అంత కూడా చాలా ఉల్లాసంగా గడిచిందని మహేష్ బాబు పేర్కొన్నాడు . అలాగే ఆ షూట్ కోసం చాలా కష్టపడ్డ ద పీకాక్ మేగజీన్ జర్నలిస్టులు ఫాల్గుణి, షేన్లకు కూడా మహేశ్ బాబు థ్యాంక్స్ చెప్పారు.
ద పీకాక్ మేగజీన్ కవర్ పేజ్ పై స్టైలిష్ లుక్ లో ఉన్న మహేష్ బాబు ఫోటోలను చూసిన ఆయన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇది ఇలా ఉంటే మహేష్ బాబు తాజాగా నటించిన సర్కార్ వారి పాట సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా పరుశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. మైత్రీ మూవీ మేకర్స్ , జీఏంబీ ఎంటర్టైన్మెంట్ , 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మించారు.