అల్లరి నరేష్ కు ఈ సినిమా 'నాంది' లాంటి హిట్ ను ఇస్తుందా?
కాగా ప్రస్తుతం ఈ హీరో మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో మన ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. అడవిలో నివాసం సాగించే ఓ తెగకు సంబంధించిన సమస్య పరిష్కారం కోసం ఆరాటపడే యువకుడిగా వెండితెరపై పోరాడేందుకు సిద్దం అవుతున్నారు 'అల్లరి' నరేశ్. ఇంతకీ ఆ సమస్య ఏమిటి ? ఆ సమస్యకు పరిష్కారం లభించిందా లేదా? అన్నది వెండి తెరపై చూడాలి.
నరేశ్ హీరోగా చేస్తోన్న చేస్తున్న చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఈ సినిమాలో ఆనంది హీరోయిన్గా చేస్తున్న విషయం తెలిసిందే. రాజేష్ దండు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ మోహన్ దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు . కాగా నిన్న మంగళవారం (మే 10) 'అల్లరి' నరేశ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇది చూస్తుంటే ఈ చిత్రంలో కూడా నరేష్ ఒక వైవిధ్యభరితమైన పాత్రలు పోషిస్తున్నారని అర్థమవుతోంది. ఇప్పటికే డిఫరెంట్ కథాంశంతో వచ్చిన నాంది మూవీ మంచి హిట్ ను అందించింది. ఆ ధైర్యంతోనే మళ్ళీ నరేష్ ఈ విధమైన కాన్సెప్ట్ ను ఎంచుకున్నాడని సినీ వర్గాలు భావిస్తున్నాయి.