SVP : రెండ్రోజుల్లోనే 100 కోట్ల వసూళ్లు.. 50% రికవరీ!

Purushottham Vinay
టాలీవుడ్ అగ్ర నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా మొన్న అనగా మే 12 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఘన విషయం తెల్సిందే. ఈ సినిమా మొదటి ఆట నుండే మిక్స్డ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది.అయితే చాలా మంది నుంచి పాజిటివ్ టాక్  రావడంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. యాంటి ఫ్యాన్స్ ఈ సినిమాపై ఎంత నెగటివ్ ప్రచారం చేసినా కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం సర్కారు వారి పాట సినిమా మాత్రం నిరాశపరచలేదు. వసూళ్లతో వాళ్ళ నోళ్లను గట్టిగా మూయించింది. ఇక ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ ప్రభావాన్ని చూపించింది.ఇక వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా సినిమాల రికార్డులను కూడా బద్దలు కొట్టి ఆల్ టైం రికార్డుని కూడా సొంతం చేసుకుంది.ఇక తొలిరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో సర్కారు వారి పాట 36.89కోట్ల రూపాయల షేర్, వరల్డ్ వైడ్ 47 కోట్ల షేర్, ఇక గ్రాస్ 75 కోట్లు సాధించింది.


ఇది ఖచ్చితంగా నాన్-ఆర్ ఆర్ ఆర్ రికార్డ్. డివైడ్ టాక్ తో ఈ కలెక్షన్స్ రాబట్టిందంటే అంటే సూపర్బ్ అనే చెప్పాలి.ఇక రెండో రోజు కూడా మంచి వసూళ్ళని రాబట్టింది. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 12 కోట్లు షేర్ రాబట్టిన ఈ సినిమా టోటల్ గా ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల షేర్ ని రాబట్టింది. అలాగే గ్రాస్ పరంగా చూసినట్లయితే 100 కోట్లు వసూలు చేసింది. ఇక రెండు రోజుల్లోనే ఈ సినిమా 50 శాతం రికవరీ ని సాధించింది.పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఎస్ ఎస్ థమన్ అందించిన సంగీతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అలాగే సముద్రఖని విలన్ పాత్రలో నటించాడు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఇంకా అలాగే జీఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: