సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే తాజాగా విడుదలయిన సర్కారు వారి పాట సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు. సర్కారు వారి పాట సినిమా విడుదల అయ్యి, బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో మహేష్ బాబు తిరిగి తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే మహేష్ బాబు తన తదుపరి సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం మన అందరికి తెలిసిందే. ఇది వరకే మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు తెరకెక్కాయి.
ఈ రెండు సినిమాలలో అతడు మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ గా నిలవగా , ఖలేజా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశ పరిచినప్పటికీ బుల్లితెరపై మాత్రం ప్రేక్షకులను బాగానే అలరించింది. మరీ ముఖ్యంగా అతడు మరియు ఖలేజా సినిమాలలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన డైలాగ్ లు , ఆ డైలాగ్ లను మహేష్ బాబు పలికిన విధానం అద్భుతంగా ఉంటాయి. ఇలా మరొక సారి ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ కాబోతుంది అని తెలియడంతో మహేష్ బాబు అభిమానులతో పాటు సామాన్య సినీ ప్రేమికులు కూడా ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అయి, అప్పుడు విడుదల అవుతుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా మహేష్ బాబు కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. మహేష్ బాబు తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అంటే నాకు చాలా ఇష్టం, త్రివిక్రమ్ శ్రీనివాస్ రచనలో నటించడం ఒక అద్భుతమైన అనుభవం. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల వల్ల నేను పొందే సంతృప్తే వేరు. కాబట్టి నేను త్వరగా షూటింగ్ ప్రారంభించాలని ఎదురు చూస్తున్నాను అంటూ మహేష్ బాబు తాజాగా తెలియజేశాడు.