"సర్జరీ"లు చేసుకుని మరణించిన సెలెబ్రిటీలు వీరే ?
అందాల తార అతిలోక సుందరి శ్రీదేవి గురించి తెలియని తెలుగు వారు ఉంటారంటే అతిశయోక్తి కాదు. ఈమె కూడా తన అందం కోసం కొంచెం సరిగా లేని తన ముక్కుని సర్జరీ చేసి షేప్ ను మార్చుకుంది. అప్పటి వరకు సౌత్ లోనే సర్జరీ చేయించుకున్న మొదటి నటి ఈమే కావడం విశేషం. ఇక ఈమె కాకుండా ఇదే విధంగా సర్జీరీ చేసుకున్న వారిలో ఇంటర్నేషనల్ పాప్ సింగర్ మైకేల్ జాక్సన్, కత్రినా కైఫ్, రాఖీ సావంత్, జుహీ చావ్లా, వాణి కపూర్ లాంటి వారున్నారు. అయితే కొంతకాలం తర్వాత వీరు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాదపడినట్లు తెలుస్తోంది. ఈ సర్జరీ వలన వారి శరీరంలో అయితే కొంతమంది ఈ సర్జరీల కారణంగా ప్రాణాలను సైతం కోల్పోయినట్లు మనకు సమాచారం ఉంది.
అంతెందుకు ఒకప్పుడు టాలీవుడ్ ను తన అందంతో ఊపేసిన కుమారి ఆర్తి అగర్వాల్ సర్జరీ కారణంగానే మరణించిందని తెలిసిందే. అలాగే పంజాబీ నటుడు వివేక్ కూడా సరాజారీ కారణంగానే చనిపోయాడు. కన్నడ నటి అయినా చేతనా రాజ్ కూడా సర్జరీ వికటించి ప్రాణాలు వదిలింది. అందుకే అందం ఒక్కటే అవసరం కాదు ఆ తర్వాత అనుభవించాల్సిన జీవితం ఎంతో ఉంది.