హీరోయిన్ ఫేస్ ల పై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్..!!

Divya
రక్త చరిత్ర సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ రాధిక ఆప్టే.. ఆ తరువాత బాలకృష్ణ సరసన లెజెండ్, లయన్ వంటి చిత్రాలలో నటించింది ఆ తర్వాత.. రజినీతో కబాలి అనే సినిమాలో నటించింది. అయితే సినిమాలలో కంటే ఈమె పలు వివాదాలు లోనే ఎక్కువగా పేరు పొందుతూ ఉంటుంది రాధిక ఆప్టే. వివాదాస్పదమైన వెబ్ కంటెంట్ల తో తెరకెక్కిస్తున్న లవ్ స్టోరీస్ తో మరింత పాపులర్ అయింది రాధిక ఆప్టే. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లో నటిస్తూ చాలా బిజీగా ఉంది. తాజా ఇంటర్వ్యూలో రాధిక ఒక స్పెషల్ కామెంట్లు చేసింది.

తన తోటి కథానాయకుల పై సర్జరీ ముఖాల పైన కామెంట్ చేసింది. ఇక వారి అందరి ముఖాలు చూడలేక అలసి పోయారని హాట్ కామెంట్ చేసింది. ఇండస్ట్రీలో నటిగా తాను ఎదుర్కొంటున్న సవాళ్లు గురించి కూడా తెలిపింది. నటీనటుల ముక్కల శరీర భాగాలను ఎక్కువగా చక్రం చికిత్సతోనే మార్చుకున్నారని తెలిపింది. వాటిని చూసి భరించలేక పోతున్నాను అని వెల్లడించింది రాధిక ఆప్టే. ముఖ్యంగా సినీ పరిశ్రమలో వయసుతో పోరాడలేక తారలు శరీరంతో పోరాడుతున్నట్లు ఆమె తెలియచేసింది.

ముఖం శరీర ఆకృతిని మార్చడానికి ఎంతోమంది ఎన్నో రకాల  శస్త్ర చికిత్స చేయించుకున్నారు. అలా చేయించుకున్న వారు చాలా మంది సహచరులను తమకు తెలుసని తెలియజేసింది. ప్రస్తుతం విక్రమ్ వేద రీమిక్స్ సినిమాలో చాలా బిజీగా ఉంటోంది రాధిక ఆప్టే. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇలాంటి పలు వివాదాస్పదమైన అంశాలను తెలియజేసింది. 17 ఏళ్లకు పైగా సినీ పరిశ్రమ లో భాగమైన రాధిక ఆప్టే ఒక విషయంలో మాత్రం చాలా ఖచ్చితంగా ఉన్నానని తెలియజేసింది.

ఏమిటంటే తను ఏ దానికి రాజీపడటం ఇష్టపడనని..నచ్చని పని అంగీకరించనని రాధిక ఆప్టే వెల్లడించింది. చిన్న చిన్న చర్చలు అవసరం అనుకున్నప్పుడు ఏ పార్టీలకో హాజరవుతానని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: