ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం బాలీవుడ్ వర్సెస్ సౌత్ హవా నడుస్తోంది. అయితే ఒకవైపు బాలీవుడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలవుతుండగా, సౌత్ సినిమాల క్రేజ్ మాత్రం కొనసాగుతూనే ఉంది.ఇక తాజాగా వలిమై, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 తర్వాత, ఇప్పుడు ప్రస్తుతం కమల్ హాసన్ తాజా సినిమా విక్రమ్ కూడా విడుదలకు ముందే హిట్ కొట్టేసేంది.ఇక ఈ సినిమా విడుదలకు ముందే రూ. 204 కోట్ల బిజినెస్ చేసింది.అయితే సినిమా మొత్తం బడ్జెట్ రూ.150 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. అంతేకాకుండా ఈ కోణంలో ఈ సినిమా విడుదలకు ముందే రూ. 54 కోట్లకు పైగా లాభాలను రాబట్టింది. ఇకపోతే కమల్ కెరీర్లో ప్రీ రిలీజ్లో ఇంత బిజినెస్ చేసిన తొలి సినిమా ఇదేనని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.కాగా విక్రమ్ సినిమాని లోకేష్ కంగరాజ్ డైరెక్షన్ చేశారు.
అయితే సౌత్ సినిమాలు అడ్వాన్స్గా కోట్లకు పడగలెత్తుతున్నాయి. ఇక విక్రమ్ కూడా ఇదే ట్రెండ్ను కొనసాగించింది.కాగా ఈ సంవత్సరం ఇప్పటివరకు, బచ్చన్ పాండే, ఝుండ్, ఎటాక్, గంగూబాయి కతియావాడి, ధాకడ్, జయేష్భాయ్ జోర్దార్, భూల్ భూలయ్య 2, ఢాకడ్ డిజాస్టర్లో విడుదలయ్యాయి. వీటిలో గంగూబాయి కతియావాడి, భూల్ భూలయ్య మాత్రమే రూ. 100 కోట్ల క్లబ్ను దాటాయి. అయితే మిగిలిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు. ఇకపోతే మరోవైపు, కంగనా నటించిన ఢాకడ్ బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది డిజాస్టర్గా నిలిచింది. కాగా ఈ సినిమా బడ్జెట్ రూ. 80 నుంచి రూ.90 కోట్లు కాగా ఇప్పటి వరకు కేవలం రూ.3 కోట్లు కూడా రాబట్టలేకపోయింది.అయితే విడుదలైన 8వ రోజు కేవలం 20 టిక్కెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.ఇదిలావుండగా కమల్ తాజా చిత్రం విక్రమ్.. యాక్షన్ థ్రిల్లర్ జానర్లో రానున్న ఈ సినిమా.. ఓటీటీ హక్కులు, అడ్వాన్స్ బుకింగ్ నుంచే భారీగా లాభాలను దక్కించుకుంది.
అంతేకాదు సౌత్ ఇండస్ట్రీ ట్రేడ్ అనలిస్ట్, ట్రాకర్ రమేష్ బాలా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి సమాచారం అందించారు. కాగా విక్రమ్ కమల్ హాసన్ అత్యధిక ప్రీ-రిలీజ్ బిజినెస్ ఫిల్మ్ అని అతను పేర్కొన్నాడు. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్తో పాటు ఓటీటీ రైట్స్ ద్వారా రూ. 200 కోట్లకు పైగా వసూలు చేసింది.కాగా ఈ సినిమాలో కమల్ హాసన్తో పాటు విజయ్ సేతుపతి మరియు శివాని నారాయణ్, ఫహద్ ఫాసిల్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఇక అసలు విషయం ఏమిటంటే కమల్ హాసన్ అభిమానులు అడ్వాన్స్ బుకింగ్ కోసం బారులు తీరారు. కాగా ఈ సినిమా టిక్కెట్ల కోసం అభిమానులు తెల్లవారుజామున 4 గంటల నుంచే క్యూలు కట్టారు. అయితే ‘విక్రమ్’ సినిమాకి సౌత్లోని పెద్ద నగరాల్లో మంచి డిమాండ్ ఉంది. ఇకపోతే అందులో చెన్నై కూడా ఉంది. అయితే అదే సమయంలో, ఒక అభిమాని ఈ చిత్రం కోసం 60 టిక్కెట్లు తీసుకున్నాడు. ఇకపోతే టిక్కెట్టుతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడతో, అది వైరల్ అవుతోంది.