సమంత విడాకుల విషయంలో ప్రశ్నలు ఎదుర్కోబోతోందా..!!
అయితే ఇందులో ఎక్కువగా బాలీవుడ్ సెలబ్రిటీలు కనిపిస్తూ ఉండేవారు కానీ తాజాగా ప్రచారం కానున్న సీజన్లో బాలీవుడ్ తో పాటు సౌత్ సెలబ్రిటీలను కూడా పాల్గొనే విధంగా ప్లాన్ చేశారు సమాచారం. దక్షిణాది ప్రేక్షకులను కూడా ఆకట్టుకువాలనే ఉద్దేశ్యంతో ఇలా ప్లాన్ చేశారట. ఇక ఇందులో భాగంగానే స్టార్ హీరోయిన్ అయిన సమంత కాఫీ విత్ కరణ్.. ఏడో సీజన్ లో పాల్గొనబోతున్నానది అంటూ అందుకోసమే ఆమె ముంబై కి వెళ్ళింది అని వార్తలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. కరణ్ జోహార్ ఎలాంటి ప్రశ్న అడుగుతారనే విషయంపై ప్రతి ఒక్కరిలో ఆసక్తి రేపుతోంది. అయితే ఈ షో లో ఎక్కువగా కొన్ని కఠినమైన ప్రశ్నలు అడుగుతారు అనే టాక్ కూడా ఉంది. ఒకవేళ ఇదే రీతిలో కరణ్ జోహార్ అడిగినట్లు అయితే ఖచ్చితంగా సమంత విడాకుల వ్యవహారం గురించి అడిగే అవకాశం ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు. సమంత జీవితంలో విడిపోవడం అనేది చాలా కఠినమైన దశ కాబట్టి ఎక్కడికి వెళ్ళిన వీటి గురించి ప్రశ్నలు ఎదురవుతాయని చెప్పవచ్చు. ఇక అంతే కాకుండా కరణ్ జోహార్ కు అక్కినేని ఫ్యామిలీతో కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. అయితే ఏ విషయాన్ని అయినా ధైర్యంగా చెప్పే సమంత విడాకుల వ్యవహారం మాత్రం ఇప్పటికీ చెప్పలేదు.మరి ఈ షో లోనైనా ఏమైనా చెబుతుందేమో చూడాలి.