స్టార్ హీరోలు అడిగినా సినిమా చేయని నిర్మాత ?
ఎం ఎస్ రాజు నుండి మరో ప్రాజెక్ట్ త్వరలో మనముందుకు రాబోతుంది. సుమంత్ అశ్విన్ హీరోగా నటించిన 7 డేస్ 6నైట్స్ అనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సర్వం సిద్ధం చేశారు ఎం ఎస్ రాజు అండ్ టీం. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎంఎస్ రాజు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో విషయం వైరల్ గా మారింది. పౌర్ణమి చిత్రం తరవాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాను, ఎన్నో అంచనాల మద్య రూపొందించిన ఊహించని విధంగా ఫెయిల్ అవడంతో షాక్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చారు. ఇక చాలా గ్యాప్ తరవాత మళ్ళీ డర్టీ హరీ అంటూ దర్శకుడిగా మారగా ఆ సినిమా మంచి ఫలితాన్ని ఇచ్చింది. కాగా
కాగా మళ్ళీ ఆ తర్వాత మధ్యలో చాలా మంది హీరోలు తన వద్దకు వచ్చి తమతో సినిమాలు చేయమని అడిగారట కానీ ఆయన కుదరదని చెప్పేశాడట. ఆ లిస్ట్ లో మాస్ మహారాజా రవితేజ కూడా ఉన్నారని చెప్పారు. హీరో రవితేజ కూడా తనతో ఒక సినిమా తీయమని అడగగా అందుకు నో చెప్పాను అని తెలిపారు ఎంఎస్.రాజు. అంతేకాదు మహేష్ బాబు త్రివిక్రమ్ మూవీ కూడా రాగా దానికి కూడా నో చెప్పానని, చెప్పేశారు. ఆ కథ నచ్చలేదని, అంతే కాకుండా ఆ టైం లో సినిమాలు నిర్మించకూడదని అనుకున్నాను అని అందుకే ఖలేజా సినిమా కి నేను చేయనని చెప్పాను అంటూ సంచలన విషయాలు వెల్లడించారు. అనుష్క రుద్రమదేవి సినిమాకు కూడా తన వద్దకు రాగా అది కూడా రిజెక్ట్ చేశారట. ఇక ఇప్పటి విషయానికి వస్తే.... మహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు డేట్లు ఇచ్చినా కూడా సినిమాలు తీయనని తాను ఎంచుకున్న సినిమాలు మాత్రమే చేస్తాను అని షాకింగ్ కామెంట్స్ చేసారు ఎం.ఎస్.రాజు. ఎం.ఎస్.రాజు..