అలా చేస్తే నా ఫ్యామిలీ ప్రైవసీ పోతుంది : గోపీచంద్

Purushottham Vinay
'లౌక్యం' సినిమా తర్వాత సక్సెస్ కోసం దాదాపు ఏడేళ్ల నిరీక్షించిన గోపీచంద్.. ఇక గతేడాది 'సీటీమార్' సినిమాతో ఓ మోస్తరు విజయాన్ని సాధించారు. ఇప్పుడు కామెడీ డైరెక్టర్ మారుతితో కలిసి ''పక్కా కమర్షియల్'' చిత్రంతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను ఆయన పంచుకున్నారు.దర్శకుడు మారుతి ఎప్పటికప్పుడు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు వినోదాత్మక సినిమాలు రూపొందిస్తారని ఇంకా దానికి తన స్టైల్ ఆఫ్ యాక్షన్ కూడా కలిస్తే ఇంకా పెద్ద సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతో 'పక్కా కమర్షియల్' సినిమా చేసినట్లు హీరో గోపీచంద్ తెలిపారు. ఇంకా మారుతి చాలా స్పీడని ఇంకా అలాగే అతని శైలికి అలవాటు పడడానికి కొన్ని రోజులు టైం కూడా పట్టిందని చెప్పారు. చిన్న చిన్న చేంజెస్ చెప్పడానికి కూడా అవకాశం లేకుండా మారుతి అద్భుతమైన స్క్రిప్టుతో ఈ సినిమాను తీర్చిదిద్దాడని కూడా గోపీచంద్ పేర్కొన్నారు.తన వ్యక్తిగత జీవితం గురించి పబ్లిక్ కు తెలియకుండా జీవించే సెలబ్రిటీలలో గోపీచంద్ ఒకరు. సోషల్ మీడియాలో తన సినిమాల విషయాలే తప్ప ఇక ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను కూడా ఆయన ఎప్పుడూ షేర్ చేయలేదు.



ఇక ఇదే అంశంపై గోపీచంద్ స్పందిస్తూ.. వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్ చేయడం తనకు అసలు ఇష్టం ఉండదని అన్నారు. ఇక అలా చేస్తే తనతో పాటుగా కుటుంబ సభ్యుల ప్రైవసీ కూడా పోతుందని ఆయన తెలిపారు. సోషల్ మీడియా అనేది చాలా పవర్ ఫుల్ అని.. దాన్ని ఎంత జాగ్రత్తగా వాడితే అంత మంచిదని ఆయన చెప్పారు.''సోషల్ మీడియాను కేవలం నా సినిమా అప్ డేట్స్ కోసమే ఉపయోగిస్తాను. అప్ డేట్స్ మాత్రమే ఇస్తాను.. వ్యక్తిగత విషయాలను అసలు షేర్ చేయను. నా ప్రైవేట్ లైఫ్ ను పబ్లిక్ లో పెట్టడం నాకు అసలు ఇష్టం ఉండదు. అలా చేస్తే నా ప్రైవసీ పోతుందని నా ఫీలింగ్. చాలామంది కూడా తమ వ్యక్తిగత విషయాలు కూడా చెబుతుంటారు. ఇక అది వారి ఇష్టం. నా వరకు పర్సనల్ విషయాల్ని నేను సోషల్ మీడియాలో అసలు పెట్టను. దాని వల్ల నాతో పాటు నా ఫ్యామిలీ ప్రైవసీ కూడా పోతుందని నేను భావిస్తాను'' అని గోపీచంద్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: