దర్శక దిగ్గజం రాజమౌళి గురించి ప్రత్యేకమైన పరిచయం లేదు అయితే తాజాగా దర్శకుడు రాజమౌళి మహాభారతం సినిమా నోరు విప్పారు.ఇక మింట్ కిచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళిని మీకు ఏ ఆశయాలు మిగిలి ఉన్నాయని అడిగితే, నేను సినిమాలను పెద్దవిగా, మరింత పెద్దవిగా, గొప్పగా తీయాలనుకొంటున్నాను.అంతేకాదు భారతీయ కథలను ఈ ప్రపంచానికి చెప్పాలనుకొంటున్నానని అన్నారు. మహాభారతం గురించి చెబుతూ, ఇది నా సుదీర్ఘమైన, సుదీర్ఘమైన, సుదీర్ఘమైన కలల ప్రాజెక్ట్. నేను ఆ మహాసముద్రంలోకి అడుగు పెట్టడానికి చాలా టైం పడుతుంది. ఇక నేను “మహాభారతం”లోకి అడుగుపెట్టే ముందు, రెండు మూడు సినిమాలు చేస్తానని అన్నారు.
ఇకపోతే బహుశా 2025 తర్వాత. అంతేకాదు కొత్త టెక్నాలజీతో మహాభారతాన్ని ఈ ప్రపంచం చూసేలా తీర్చిదిద్దాలన్నది ఆయన ఉద్దేశంలా కనిపిస్తోంది.ఇదిలావుంటే దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి RRRతో మరో అద్భుతాన్ని ఇండియన్ స్క్రీన్ మీద ఆవిష్కరించారు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్ నటిస్తే, అతిథి పాత్రలో అజయ్ దేవగన్ రేంజ్ పెంచారు.ఇక ఈ ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.పోతే బాహుబలి 2ని దాటి భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద ఓపెనర్గా నిలిచింది. అయితే ఒక మాటలో రాజమౌళి తనతో తానే పోటీ పడుతున్నారు. అయితే మొత్తంమీద rrr ప్రపంచ వ్యాప్తంగా ₹1115 కోట్ల గ్రాస్ సాధించింది.
కాగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రాల జాబితాలో, దంగల్, బాహుబలి ది కన్క్లూజన్, kgf 2 తర్వాత నాల్గవ స్థానం ఆర్ఆర్ఆర్ దే.ఇక్కడ ఆశ్చర్యమేంటంటే, కేజీఎఫ్ కు మూడో స్థానం దక్కడం.ఇక మింట్ ఇంటర్వ్యూలో S.S. రాజమౌళి తన కలల ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం తన ప్లాన్ ను బైటపెట్టారు.అయితే అదే మహాభారతం. ఇలాంటి భారతీయ ఇతిహాసాన్ని వెండితెర మీదకు తీసుకొనిరావాలంటే రాజమౌళి కన్నా సమర్ధులు ఎవరూ లేరనే అనుకోవచ్చు.కాగా అది ఎంత పెద్ద ఫ్రాంజైజ్ కానుందో రాజమౌళికి తెలుసు.ఇక ఇది పదివేల కోట్లరుపాయిల ప్రాజెక్ట్. అయితే ఇప్పుటికే ఆయన మహాభారతం గురించి పని మొదలుపెట్టారని ఆయన సన్నిహితులు అంటున్నారు.పోతే మహాభారతాన్ని తీయడానికి చాలా సమయం పడుతుంది. ఇకపోతే బహుశా మూడు పార్టుల్లో ఆయన తీయొచ్చు.అయితే ఈలోగా అవతార్ వస్తోంది. టెక్నాలజీ మరో మెట్టు ఎక్కుతుంది.ఇక అప్పుడు రాజమౌళికి మహాభారతం మీద మరింత క్లారిటీ రావచ్చు...!!