ప్రపంచంలోనే విలువైన వజ్రాన్ని బహుమతిగా పొందిన మిల్క్ బ్యూటీ..ఎవరిచ్చారంటే..!
ఇక తమన్నా గురించి , ఆమె నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ్, కన్నడ , హిందీ భాషా చిత్రాలలో కూడా నటించి మెప్పించిన తమన్నా సుమారుగా రూ.150 కోట్లకు పైగా ఆస్తిని కూడబెట్టినట్లు కూడా సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా వైరల్ అవుతున్న విషయం ఏమిటంటే ప్రపంచంలోనే అత్యంత విలువైన 5 వ అతిపెద్ద వజ్రం తమన్నా దగ్గర ఉండడం గమనార్హం. ఇక ఈ వజ్రం ఈమె దగ్గర ఉండడం చూసి ఆమెకు ఈ వజ్రాన్ని ఎవరు ఇచ్చారు? ఎలా సొంతం చేసుకుంది? అనే విషయాలు కూడా బాగా వైరల్ గా మారుతున్నాయి.. అసలు విషయం ఏమిటంటే మెగా కోడలు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొనిదెల తమన్నాకు ఎంతో ప్రీతిగా ఈ అరుదైన వజ్రాన్ని బహుమతిగా అందించిందట.
అంతేకాదు ఈ విషయాన్ని తమన్నా ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించడం జరిగింది. ఇక ఈ వజ్రం విలువ సుమారుగా రూ.2 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ఇంత అరుదైన, ఖరీదైన వజ్రాన్ని ఉపాసన బహుమతిగా ఇచ్చింది అంటే తమన్నా పై ఆమెకు ఎంత ఇష్టం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.