సంచలన నిర్ణయం తీసుకున్న కొరటాల శివ.. ఇకపై వాటికి దూరంగా..?

Anilkumar
దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం  మౌనవ్రతం పాటిస్తున్నారు. అది కూడా కేవలం మీడియా ముందే.అయితే  ఆచార్య సినిమా ప్లాప్ తర్వాత.. పూర్తిగా నిరుత్సాహానికి గురి అయ్యాడు కొరటాల.ఇక ఆ నిరుత్సాహం కంటే కూడా.. 'కొరటాల'ను ఎక్కువగా బాధ పెట్టింది మాత్రం మీడియానే.ఇకపోతే  బయ్యర్లు తన అఫీస్ పై ఎటాక్ చేశారని మీడియా పుకార్లు పుట్టించి.. తన పరువు తీసింది అని కొరటాల శివ ఫీల్ అవుతున్నాడు.అయితే అందుకే, ఎన్టీఆర్ తో తాను చేసే సినిమా విడుదల అయ్యేవరకూ ఇక మీడియాతో మాట్లాడకూడదని కొరటాల నిర్ణయించుకున్నారు.ఇకపోతే  ఎన్టీఆర్ సినిమా మార్నింగ్ షో పడిన తర్వాత, కొరటాల మీడియా కోసం ప్రెస్ మీట్ పెడతాడట. 


ఇక అప్పుడే తన పై వచ్చిన రూమర్స్ కి జవాబు చెబుతా అంటున్నాడు.ఇదిలావుంటే  సాధారణంగా సినిమా విడుదలకు ముందు మీడియాతో మాట్లాడడం అన్నది డైరక్టర్లకు అలవాటు.అయితే అదే, సినిమా గనుక ప్లాప్ అయితే, ఇక ఆ తర్వాత కొంత మంది డైరెక్టర్లు మీడియా ముందుకు రారు. ఇకపోతే  కొరటాల ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఆచార్య ప్లాప్ కాదు, ఆచార్య నష్టపరిహారం విషయం కావచ్చు.ఇదిలా ఉంటె రిలీజ్ కి ముందు ఆచార్య సినిమా గురించి కొరటాల మామూలుగా కబుర్లు చెప్పలేదు. అయితే కానీ, ఆచార్య సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా పల్టీ కొట్టింది.


ఇక దాంతో నెటిజన్లు, కొరటాల, ఆచార్య సినిమా ముందు చెప్పిన కబుర్లను పట్టుకుని విపరీతంగా ట్రోల్ చేసారు. ఇకపోతే బహుశా అందుకే ఇప్పట్లో మీడియాతో మట్లాడాలని లేదు అంటూ కొరటాల దూర దూరంగా ఉంటున్నాడు. కాగా  ఎన్టీఆర్ సినిమా మీద కొరటాల చాలా నమ్మకంతో ఉన్నాడు.అంతేకాదు పైగా ఆర్ఆర్ఆర్ తర్వాత, ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కొరటాల దే. ఇక అందుకే ఈ సినిమా మీద భారీ అంచనాలు వున్నాయి. అయితే...కాబట్టి, కొరటాల తన మౌనాన్ని ఎన్టీఆర్ సినిమా విడుదల మధ్యాహ్నం బద్దలు కొడతాడట. ఇక  సినిమా హిట్ టాక్ తరువాత వచ్చే జోష్ వేరు. ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: