రజినీకాంత్ కూతురుకి గ్యాప్ వచ్చిందా తీసుకుందాం..?

Divya
టాలీవుడ్ లో హీరోయిన్ నివేద థామస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. కేరళలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ మలయాళ సినిమాతో బాలనాటిగా తన కెరీర్ ని మొదలు పెట్టింది. ఆ తర్వాత హీరోయిన్ గా మారి మొదటిసారిగా నానితో కలిసి జెంటిల్ మెన్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఇక తన మొదటి సినిమాతోనే అందం ,అభినయంతో మించి టాలెంట్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది నివేద థామస్. అయితే తనకు వచ్చిన అవకాశాలన్నీ ఉపయోగించుకున్న ఈ మధ్యకాలంలో ఏ సినిమాలో కూడా నటించలేదు.


చివరిగా ఈ ముద్దుగుమ్మ వకీల్ సాబ్ సినిమాలో నటించింది కానీ అంతగా పేరు రాలేదు కానీ రజనీకాంత్ తో కలిసి దర్బార్ సినిమాలో ఆయన కూతురుగా నటించి మంచి మార్కులను సంపాదించుకుంది. ఇక టాలీవుడ్ లో ఎంతోమంది హీరోల సరసన ఈమె నటించి మెప్పించిన కూడా అవకాశాలు రాకపోవడం ఆశ్చర్యంగా ఉన్నది... ప్రస్తుతం నివేద థామస్ చేతులు షాహిని డాకిని అనే ఒక సినిమా మాత్రమే ఉన్నది. ఈ సినిమాని డైరెక్టర్ సుధీర్ వారు తెరకెక్కిస్తున్నాడు విచిత్రంలో రెజీనా కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నది. ఈ సినిమా కొరియన్ మూవీ మిక్స్డ్ రన్నర్ అన్నట్లుగా సమాచారం.



ఈ సినిమాకు సంబంధించి గత ఏడాది చిత్ర బృందం ఒక పోస్టర్ను మాత్రమే విడుదల చేశారు ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు. ఇంతకీ ఈ సినిమా ఉంటుందో లేదో అన్నట్లుగా కూడా ఆమె అభిమానుల సైతం భావిస్తున్నారు. గతంలో నిర్మాత సురేష్ బాబు ఈ సినిమాని ఓటిటి లో విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు కానీ అందుకు సంబంధించిన ప్రకటన మాత్రం ఇప్పటివరకు రాలేదని చెప్పవచ్చు. అయితే అందం ,అభినయంతో ,ముద్దుగా ఆకట్టుకున్న నివేద థామస్ కు అవకాశాలు ఎందుకు రాలేదు తెలియడం లేదని ఆమె అభిమానుల సైతం భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: