అనుపమ పరమేశ్వరన్ 'అ ఆ'
మూవీ లో పల్లెటూరి
అమ్మాయి పాత్రలో నటించి తన నటన తో , అంద చందాలతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది . ఆ తర్వాత అనుపమ పరమేశ్వరన్ తెలుగు లో అనేక
మూవీ లలో నటించి ప్రస్తుతం
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ
హీరోయిన్ గా కెరీర్ ను కొన సాగిస్తోంది . ఇది ఇలా ఉంటే తాజాగా అనుపమ పరమేశ్వరన్ నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వం లో తెరకెక్కిన
కార్తికేయ 2
మూవీ లో
హీరోయిన్ గా నటించింది .
ఈ
మూవీ ఇప్పటికే
బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సాధించింది .
కార్తికేయ 2
మూవీ ద్వారా అనుపమ పరమేశ్వరన్
హిందీ లో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది . ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు సౌత్ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న అనుపమ పరమేశ్వరన్ ఒక క్రేజీ ప్రొడక్షన్
హౌస్ లో తెరకెక్కబోయే
హిందీ మూవీ లో నటించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఒక క్రేజీ
బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈ ముద్దు గుమ్మను
హిందీ లో లాంచ్ చేయడానికి సంప్రదింపులు జరగా కథ బాగా నచ్చిన అనుపమ పరమేశ్వరన్ ఈ
హిందీ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.