చిరంజీవి బర్త్డే వేడుకలలో రామ్ చరణ్ ఒక్కరేనా..?
అయితే ఈ వేడుకలకు పవన్ కళ్యాణ్ కానీ అల్లు అర్జున్ కానీ హాజరు కాకపోవడంతో ఆమెకు అభిమానులు సైతం కాస్త నిరాశ చెందారని చెప్పవచ్చు.. ఈ కార్యక్రమానికి నిహారికతో సాయి ధరంతేజ్, వైష్ణవ తేజ్, శిరీష్ ఎలా ఎంతో మంది మెగా హీరోలు హాజరవుతారని అందరూ భావించారు. కానీ అలాంటిది ఏమీ జరగలేదు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉండడం చేత.. అల్లు అర్జున్ న్యూయార్కులో బిజీగా ఉండడం చేత ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు.
మెగా కార్నివాల్ కార్యక్రమానికి నాగబాబు తో పాటు సాయి ధరంతేజ్ మాత్రమే హాజరయ్యారు.. మిగిలిన హీరోలు ఎవరు కూడా అక్కడ కనిపించలేదు అయితే ఈ కార్యక్రమానికి ఎంతోమంది అభిమానుల సైతం తరలి రావడం జరిగింది. ఇక ఆవేదికపై సాయి ధరంతేజ్, నాగబాబు మారుతి తదితరులు మాట్లాడిన మాటలు బాగా ఆకట్టుకున్నాయి. ఇక చిరంజీవి సంబంధించిన ఎటువంటి కార్యక్రమానికైనా సరే ఎవరు ఉన్నా లేకపోయినా అభిమానులు మాత్రం ఎప్పుడు మద్దతుగా నిలుస్తూనే ఉంటారని చెప్పవచ్చు. మరొకసారి ఆ విషయాన్ని ప్రూఫ్ చేశారు అభిమానులు సైతం. దీంతో మెగాస్టార్ కుటుంబం హీరోలంతా సోషల్ మీడియాలో మాత్రమే కేవలం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.