ఇప్పుడు ఎక్కడ చూసినా...ఎక్కడ విన్నా అందరి నోట వినిపిస్తున్న మాట జైలర్.అయితే అన్నాత్తే తరువాత రజనీకాంత్ నటిస్తున్న చిత్రమిది. ఇక సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు.ఇకపోతే బీస్ట్ చిత్రం తరువాత ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది.అయితే ఇక బీస్ట్ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో జైలర్ చిత్రం రజనీకాంత్ అభిమానులను కాస్త సంకటంలో పడేయటానికి కారణం ఇదేనని ప్రచారం జరుగుతోంది.కాగా తలైవా ఈసారి పక్కా మాస్ చూపించబోతున్నారని, చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ చూసిన తరువాత ఆ నమ్మకం కలుగుతోందని అభిమానులు చెబుతున్నారు.
అయితే చిత్ర షూటింగ్ ఇప్పుడే మొదలైంది. చిత్రంలో రజనీకాంత్తో పాటు ఐశ్వర్యారాయ్, తమన్నా, ప్రియాంక మోహన్, శాండల్ ఉడ్ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ ప్రముఖులు నటిస్తున్నారు.కాగా అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పోతే రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఇందులో ఆయన రెండు పాత్రలను దర్శకుడు కొత్తగా డిజైన్ చేసినట్లు సమాచారం.అయితే లేకపోతే ఇందులో రజనీకాంత్ సరసన ఎవరు నటిస్తున్నారు? అన్నది ఆసక్తిగా మారింది. ఇక చిత్రంలో తమన్నా నటిస్తున్న పాత్ర చిన్న పాత్రేనని తాజా సమాచారం.
ఇదిలావుంటే ఇంకా చెప్పాలంటే పేట చిత్రంలో త్రిష పాత్ర మాదిరి జైలర్ చిత్రంలో తమన్నా అప్పుడప్పుడు వచ్చి కనిపించి మెరిపిస్తుందట.
అంతేకాదు ఇందులో నిజం ఎంత అనేది పక్కన పెడితే చాలా గ్యాప్ తరువాత తమ అభిమాన నటిని చూడబోతున్నామని సంబరం పడే తమన్నా అభిమానులకు మాత్రం ఇది నిరాశపరిచే అంశం అవుతుంది.మరోవైపు ప్రస్తుతం టాలీవుడ్ లో తమన్నా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న బోళా శంకర్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చేయడాది ఏప్రిల్ నెలలో విడుదల కానుంది తమిళంలో హిట్ అయిన వేదాళం అనే సినిమాకి ఇది తెలుగు రీమేక్ గా రూపొందుతుంది.ఈ సినిమాలో మరో హీరోయిన్ కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలి పాత్రలో కనిపించనుంది మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.!!