'ఢీ' షోలో అఖిల్ కు.. ఇంత తక్కువ పారితోషికమా?
అయితే ఇటీవలి కాలంలో అటు ఢీ షో లో భాగంగా మెంటార్స్ మారుతూ వున్నారు. గతంలో సుధీర్ రష్మి మెంటర్స్ గా ఉండేవారు. కానీ ఇప్పుడు మాత్రం హైపర్ ఆది, అఖిల్ వారు ఢీ షో లో టీం లీడర్ గా కొనసాగుతున్నారు అన్న విషయం తెలిసిందే. బిగ్బాస్ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న అఖిల్ చివరికి ఢీ 14వ సీజన్లో అవకాశం దక్కించుకున్నాడు. ఇక హైపర్ ఆది గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు జబర్దస్త్ లో సూపర్ పాపులారిటీ సంపాదించుకునీ ఇక ఇప్పుడు ఢీ షో లో సందడి చేస్తున్నాడు. బిగ్బాస్ ఓటిటి కారణంగా ఢీ షో కి దూరమైన అఖిల్ ఇక ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు.
ఈ క్రమంలోనే ప్రస్తుతం ఢీ షో లో హైపర్ ఆది, అఖిల్ తీసుకునే రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. జబర్దస్త్ ద్వారా ఎంతగానో పాపులారిటీ సంపాదించుకున్న హైపర్ ఆది ఢీ షో కోసం ఏకంగా జడ్జ్ లతో సమానంగా పారితోషికం తీసుకుంటున్నాడట. ఒక కాల్షీట్ కోసం దాదాపు 5 లక్షల వరకు పారితోషికం అందుకుంటున్నాడట. కానీ అటు అఖిల్ కు మాత్రం చాలా తక్కువ అని తెలుస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు వారానికి రెండు లక్షల రెమ్యునరేషన్ తీసుకున్న అఖిల్ ఇప్పుడు ఒక కాల్ షీట్ కు కేవలం లక్షన్నర మాత్రమే తీసుకుంటున్నాడట.