పవన్ ఫ్యాన్స్ కి అల్లు అరవింద్ షాక్?

Purushottham Vinay
టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు  పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇండస్ట్రీ హిట్ సినిమాలు 'ఒక్కడు' 'పోకిరి' సినిమాలని మళ్ళీ విడుదల చేశారు.పదిహేను సంవత్సరాల తరువాత విడుదలైనా కూడా.. ఆ చిత్రానికి ఏమాత్రం ఆదరణ తగ్గకుండా సూపర్ స్టార్ మహేష్ అభిమానులు దానికి బ్రహ్మరధం పట్టారు. అదే తోవలో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు 'జల్సా' సినిమాని 4K క్వాలిటీతో మళ్ళీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది. ఆ సినిమా గీతా ఆర్ట్స్  ప్రొడక్షన్ హౌస్ నిర్మించగా, అల్లు అరవింద్ నిర్మాత. ప్రింట్స్ కావాలంటే ఆ సంస్థని అడగాలి. కానీ వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులను  ప్రింట్స్‌కి డబ్బులు కట్టండి అని అడుగుతున్నట్టుగా.. విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం తెలిసింది.దీనికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు.. నిర్మాత అల్లు అరవింద్ మీద చాలా కోపంగా ఉన్నట్టు తెలిసింది. వాళ్ళు ఈ డబ్బులు జనసేన పార్టీ వాళ్ళు ఇస్తారు అని అంటున్నారు, కానీ పార్టీ వాళ్ళు ఏమి మాట్లాడటం లేదు. దీనివల్ల అభిమానుల్లో కొంచెం అయోమయ పరిస్థితి నెలకొని వుంది.


వాళ్ళు సాంఘీక మాధ్యమాల్లో తమ అసక్తతను వ్యక్తం చేస్తూ.. గీతా ఆర్ట్స్‌లో భాగమైన SKNకి షేర్ చేస్తే, అతను కూడా ప్రింట్ రెడీ చేసి పెట్టాను.. నా పని ఇంతవరకే.. ఇక సీనియర్ ఫ్యాన్స్ మిగతా విషయాలు అన్నీ ఆర్గనైజ్ చేస్తారని చెప్పి చేతులు దులిపేసుకున్నారు.ఇంతకీ ఎన్ని ప్రింట్స్, ఎన్ని సినిమా హాల్స్‌లో విడుదల చేస్తున్నారు అన్నది ఇంక స్పష్టత లేదు అని కూడా అంటున్నారు. అదీ కాకుండా, పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2 శుక్రవారం అవడంతో, ముందురోజు ఈ షోస్ వేస్తున్నారు.. దీంతో మరింతగా గందరగోళ పరిస్థితి ఉన్నట్టు కనిపిస్తోందని అభిమానులు అంటున్నారని తెలిసింది. ఈలోగా పవన్ కళ్యాణ్ ఏమైనా జోక్యం చేసుకొని.. అల్లు అరవింద్‌తో మాట్లాడితే ప్రింట్స్ అన్ని బయటకి రావొచ్చు అని కొందరు అభిమానులు అంటున్నారని తెలిసింది. ఇప్పుడు ఈ విషయాన్ని జనసేనలో పవన్‌కి దగ్గరగా వుండే నాయకులకు చేరవేసి వాళ్ళను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలని పవర్ స్టార్ అభిమాన పెద్దలు ఆలోచిస్తున్నట్టు సమాచారం తెలుస్తుంది.మరి చూడాలి ఏం జరుగుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: