దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.అంతేకాదు రాజమౌళి బాహుబలి సినిమాలతోనే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు అన్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఇటీవల వచ్చిన rrr సినిమాతో రాజమౌళి ప్రపంచంలోనే గ్రేట్ డైరెక్టర్స్ లో ఒకరిగా కూడా నిలిచారు.ఇక టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అన్ని సినిమా పరిశ్రమ వ్యక్తులు, టెక్నీషియన్స్, ప్రేక్షకులు rrr సినిమాని ఎంతగానో అభినందించారు.దీనితో రాజమౌళిని తమ పొగడ్తలతో ఆకాశానికెత్తేశారు.
అయితే ఇప్పటికే rrr సినిమా సక్సెస్ తో, దానికి వచ్చిన కలెక్షన్స్ తో ప్రపంచవ్యాప్తంగా మరోసారి తెలుగు సినిమాకి గుర్తింపు తెచ్చారు రాజమౌళి. ఈ సినిమాతో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజమౌళి తాజాగా మరో అరుదైన ఘనతని అందుకుంటున్నారు.అదేంటంటే... యూఎస్ లో జరిగే ప్రముఖ హాలీవుడ్ ఫిల్మ్ ఫెస్టివల్ బియాండ్ ఫెస్ట్ లో రాజమౌళి సినిమాలని ప్రదర్శించనున్నారు. హాలీవుడ్ లో జరిగే పెద్ద సినీ ఫెస్ట్ లలో ఒకటైన ఈ బియాండ్ ఫెస్ట్ కి భారీ సంఖ్యలో ఆడియెన్స్ వస్తారు. ఇక సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 11 వరకు జరగనున్న ఈ ఫెస్ట్ లో రాజమౌళి సినిమాలని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.అయితే ఈ మేరకు ఫెస్ట్ నిర్వాహకులు ఓ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.
ఇక ఈ పోస్టర్ లో రాజమౌళి అనే పేరులో ఆయన సినిమాల పోస్టర్స్ వచ్చేలా డిజైన్ చేసి టాలీవుడ్ టు హాలీవుడ్ అని రాశారు.దీని గురించి ప్రత్యేకంగా సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు ఆ షో నిర్వాహకులు.అయితే ఈ ఫెస్ట్ లో ఈ సెప్టెంబర్ 30న "RRR" సినిమా, అక్టోబర్ 1న "ఈగ", "బాహుబలి పార్ట్ 1&2", అక్టోబర్ 21న "మగధీర", 23న "మర్యాద రామన్న" సినిమాలు కూడా ప్రదర్శించనున్నారు. అంతేకాదు రాజమౌళి కూడా ఈ ఫెస్ట్ కి అతిధిగా వెళ్లనున్నట్టు సమాచారం. అయితే ఇందులో రాజమౌళిని సన్మానించనున్నారు. ఇక దీంతో రాజమౌళి అభిమానులు, టాలీవుడ్ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనితో ఈ ఫెస్ట్ తో రాజమౌళి మరో ఘనత సాధించారు అనే చెప్పాలి..!!