అల్లుఅరవింద్, జక్కన్న కాంబినేషన్ సినిమా మళ్ళీ రాబోతుందా...?

murali krishna
గడిచిన కొన్ని సంవత్సరాలలో రాజమౌళి పేరు బ్రాండ్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. రాజమౌళి ఏదైనా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటే ఆ సినిమా గురించి జోరుగా చర్చ జరుగుతుందనే సంగతి తెలిసిందే.
రాజమౌళి తర్వాత సినిమా మహేష్ బాబు హీరోగా తెరకెక్కనుండగా ఈ ప్రాజెక్ట్ గురించి భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. భవిష్యత్తులో మహా భారతం సినిమాను భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా తెరకెక్కించాలని రాజమౌళి ఆశ పడుతున్నారు.
అయితే టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో ఒకరైన అల్లు అరవింద్ ప్రస్తుతం జక్కన్నపై దృష్టి పెట్టారని తెలుస్తోంది. అల్లు అరవింద్ నిర్మాతగా రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన మగధీర సినిమా ఏ స్థాయిలో సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమా తర్వాత చరణ్ రాజమౌళి కాంబోలో సినిమా వచ్చినా అల్లు అరవింద్ రాజమౌళి కాంబినేషన్ లో మాత్రం సినిమా రాలేదు.
అయితే అల్లు అరవింద్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోసం మహా భారత్ పేరుతో వెబ్ సిరీస్ ను నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. ఈ వెబ్ సిరీస్ కు రాజమౌళి తన వంతు సహకారం అందిస్తే ఈ వెబ్ సిరీస్ కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుంటుందని అల్లు అరవింద్ భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో భాగస్వామిగా జక్కన్నను తీసుకోవాలని అల్లు అరవింద్ భావిస్తున్నారని బోగట్టా. అయితే జక్కన్న రాబోయే రోజుల్లో మహాభారతం తెరకెక్కించాలని భావిస్తున్న నేపథ్యంలో ఆయన ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.
మగధీర సినిమా సమయంలో అల్లు అరవింద్ రాజమౌళి మధ్య మనస్పర్ధలు వచ్చాయని వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. అల్లు అరవింద్ నుంచి అలాంటి ప్రతిపాదన వస్తే జక్కన్న యస్ చెబుతారో నో చెబుతారో చూడాల్సి ఉంది. బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని ఆ సినిమాకు ప్లస్ అయిన జక్కన్న రాబోయే రోజుల్లో ఇతర సినిమాలు కూడా సక్సెస్ సాధించడానికి తన వంతు సహాయసహకారాలు అందిస్తారేమో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: