'స్రవంతి' రవికిశోర్ వల్లే అది సాధ్యమయ్యిందట!!
అంతకు ముందు శింబు చేసిన సినిమా మానాడు సినిమా భారీ విజయం అందుకోవడంతో ఈ సినిమా పై మంచి అంచనాలు పెరిగిపోయాయి. తమిళంలో రెండు రోజుల ముందుగానే విడుదల అయినా ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. దాంతో తెలుగు లో తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని భావించి ఇక్కడ భారీ గా విడుదల చేసింది. ఇక్కడ కూడా మంచి విజయాన్ని అనుదుకుంది సినిమా బృందం. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లో తెలుగు మీడియాతో చిత్ర బృందం ముచ్చటించింది.
ఈ సందర్భంగా దర్శకుడు గౌతమ్ మీనన్ మాట్లాడగా తొలుత తెలుగులో ఈ సినిమా విడుదల చేయాలనే ఆలోచన లేదు. 'స్రవంతి' రవికిశోర్ గారు ఫోన్ చేసి ఈ సినిమా ను ఇక్కడ కూడా విడుదల చేద్దామని అన్నారు. పాటలు విన్నాను. బావున్నాయి అని ప్రశంశిచారు. ట్రైలర్ చూశాక విడుదల చేయాలనే ఇదే వచ్చింది అని అయన అన్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయి లో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. తమిళ, తెలుగు భాషల్లో మంచి విజయం సాధియించిన ఈ సినిమా ను ఫ్యూచర్ లో హిందీ లో కూడా విడుదల చేసినా ఆశ్చర్య పోనవసరం లేదు. శింబు ఇలా వరుస విజయాలతో ముందుకు దూసుకు వెళ్లడం నిజంగా అయన అభిమానులను ఎంతో ఆనంద పరుస్తుంది.