చైతు సినిమా కోసం వీరిని దింపారుగా!!

P.Nishanth Kumar
అక్కినేని నాగ చైతన్య గత సినిమా థాంక్యూ ఏమాత్రం ప్రేక్షకులను మెప్పించకపోవడంతో ఇప్పుడు చేయబోయే సినిమా తప్పకుండా పెద్ద హిట్ కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే తమిళ క్రేజీ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చైతు ఓ సినిమా ను చేస్తున్నాడు. ఈ సినిమా కు 302 అనే టైటిల్ ను నిర్ణయిస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతుంది. ఈ సినిమా లో చైతు పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుంన్నారు. హీరో శింబుతో మానాడు చిత్రాన్ని తెరకెక్కించిన వెంకట్ ప్రభు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. దాంతో అయన తో సినిమా చేయలని చాలామంది హీరోలు ప్రయత్నాలు చేశారు.

చివరికి ఆ అవకాశం చైతూకి దక్కడం విశేషం. ఈ విజయంతో చైతు మూవీపై భారీ అంచానాలు ఉన్నాయి అని చెప్పొచ్చు. ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ఉండబోతోంది అని చెప్తున్నారు. ఈ సినిమా లో అందాల భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా  ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కర్ణాటక లో ఈ సినిమా యొక్క షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా యొక్క షూటిగ్ సమయంలో కర్ణాటకలో వివాదం జరిగింది. మద్యం షాపు సెట్ వేయడంతో అక్కడి గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే తాజాగా చిత్ర యూనిట్ క్రేజీ అప్డేట్ ప్రకటించింది. ఇందులో నటిస్తున్న కొంతమంది నటీనటులను ప్రకటించింది చిత్ర బృందం.

ప్రియమణి కీలక పాత్రలో నటించనుంది. ఆమెకి వెల్కమ్ చెబుతూ చిత్ర యూనిట్ అప్డేట్ ఇచ్చారు. ఇంకా సంపత్ రాజ్ కూడా ఈ సినిమా లో కీలక పాత్ర లో నటిస్తున్నాడు. ఇక మరొక ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో విల్లన్ గా అందాల నటుడు అరవింద్ స్వామి నటించబోతున్నట్లు తెలుస్తోంది.దీనిపై కూడా త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుంది. అరవింద్ స్వయ నటిస్తే ఈ సినిమా కి మంచి హైప్ వస్తుందని చెప్పొచ్చు. తెలుగు ధ్రువ సినిమా తర్వాత అయన నటిస్తున్న సినిమా ఇదే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: