బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ఏమిటంటే..?

Divya
నందమూరి బాలకృష్ణ అఖండ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ తో నటించారు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK -107 టైటిల్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ స్థాయిలో హై వోల్టేజ్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు విచిత్రాన్ని మైత్రి మూవీ బ్యానర్ పైన సినిమాలు నిర్మిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ సినిమా చివరి దశలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో హీరోయిన్ల శృతిహాసన్ నటిస్తున్నది.

ఇక ఇతర కీలకమైన పాత్రలో కన్నడ స్టార్ హీరో దునియా, విజయ్ వరలక్ష్మి శరత్ కుమార్, మలయాళం నటి నటిస్తున్నది. రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా అభిమానుల అంచనాలను తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అని అభిమానుల సైతం భావిస్తున్నారు. ఈ సినిమాకి జై బాలయ్య, రెడ్డి గారు అంటే పలు టైటిల్స్ పెట్టాలనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బాలయ్య ఈ రెండు టైటిల్ని రిజెక్ట్ చేసినట్లుగా సమాచారం.

ఇదంతా ఇలా ఉండగా మైత్రి మూవీ మేకర్ వారు నందమూరి బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది  ఈ సినిమా టైటిల్ ఈ నెల 21వ తేదీన ప్రకటించబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఈ సినిమా ఏ టైటిల్ ని బాలయ్య కోసం ఫైనల్ చేశారో అని అభిమానుల సైతం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. టైటిల్ రివిల్ చేయడానికి సరిగ్గా ఐదు రోజులు మాత్రమే ఉండడంతో బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో చాలా హంగామా చేస్తూ ఉన్నారు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నారు. మరి ఈ సినిమా సక్సెస్ అవుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: