అయ్యబాబోయ్.. జబర్దస్త్ లో కొత్త యాంకర్ వచ్చేసింది?

praveen
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం గురించి బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే దాదాపు గత దశాబ్ద కాలం నుంచి కూడా ప్రేక్షకులందరికీ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉపశమనం కలిగిస్తుంది ఈ కార్యక్రమం. సినిమాల్లో దొరికే కామెడీ కంటే వినూత్నమైన ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఇక ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించుద్ది అని చెప్పాలి. ఇక నేటి రోజుల్లో జబర్దస్త్ ప్రేక్షకులను ఎంతలా ప్రభావితం చేసింది అంటే ఎంత ఒత్తిడిలో ఉన్నా సరే కాసేపు జబర్దస్త్ చూస్తే హాయిగా నవ్వుకొని ఉపశమనం పొందవచ్చు అని అందరూ భావిస్తున్నారు.



 ఇలా దాదాపు 10 ఏళ్ల నుంచి కూడా టాప్ రేటింగ్స్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది జబర్దస్త్. తర్వాత ఎన్నో కామెడీ షోస్ వచ్చినప్పటికీ జబర్దస్త్ కి మాత్రం పోటీ ఇవ్వలేకపోయాయి. అది సరే గాని ఇంతకీ ఇప్పుడు జబర్దస్త్ గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అని అనుకుంటున్నారు కదా.. జబర్దస్త్ లో ఇటీవల ఎవరు ఊహించని ఒక పెద్ద మార్పు జరిగింది. జబర్దస్త్ మొదలైన నాటి నుంచి యాంకర్ గా కొనసాగిన అనసూయ ఇటీవల అనూహ్యంగా  జబర్దస్త్ ఉంచి తప్పుకుంది. దీంతో కొత్త యాంకర్ వస్తుంది అనుకున్నప్పటికీ ఇక పాత యాంకర్ రష్మీ నే జబర్దస్త్ లో కొనసాగించారు.



 కానీ ఇప్పుడు మాత్రం మల్లెమాల నిర్వాహకులు ఏకంగా జబర్దస్త్ యాంకర్ ను మార్చేశారు. ఇది కాస్త బులితెరపై హాట్ టాపిక్ గా మారిపోయింది. మొన్నటికి మొన్న శ్రీదేవి డ్రామా కంపెనీలో తనదైన పంచులతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సౌమ్యరావును జబర్దస్త్ యాంకర్ గా తీసుకొచ్చారు మల్లెమాల యాజమాన్యం. ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే రశ్మిని మొత్తానికే తీసేసారా లేకపోతే కేవలం రెండు మూడు ఎపిసోడ్ల కోసం సౌమ్యరావుని తీసుకువచ్చారా అన్నది మాత్రం ఇంకా ఎవరికీ తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: