నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే బాలకృష్ణ అనేక బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరోగా నటించిన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ హీరోగా ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న వీర సింహా రెడ్డి అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. దునియా విజయ్ ఈ మూవీ లో విలన్ గా కనిపించనుండగా , తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.
అఖండ మూవీ తర్వాత బాలకృష్ణ హీరో గా నటిస్తున్న సినిమా కావడం , క్రాక్ మూవీ తర్వాత గోపీచంద్ మాలినేని దర్శకత్వం వహిస్తున్న మూవీ కావడంతో , ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సంక్రాంతి కానుకగా ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ ఈ మూవీ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కామెడీ దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. బాలకృష్ణ , అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందబోతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నెల నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.