సంక్రాంతికి బిగ్ ఫైట్... "చిరు - బాలయ్య"లే సమఉజ్జీలు !
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన శృతిహాసన్ మరియు రవితేజకు జోడీగా కేథరిన్ నటిస్తున్న విషయం తెలిసిందే. రీసెంటుగా చిత్ర బృందం విడుదల చేసిన ఐటెం సాంగ్ వేర్ ఈజ్ ది పార్టీ ప్రేక్షకులను మరియు చిరు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ ను తీసుకున్నారు. ఈ మధ్యన డీఎస్పీ పైన కూడా కాపీ ట్యూన్స్ ఇస్తున్నాడన్న విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అందుకే మ్యూజిక్ పై అందరికీ చాలా అంచనాలు ఉన్నాయి, ఇక మొదటి సాంగ్ కూడా హిట్ కావడంతో మిగిలిన సాంగ్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై చర్చలు జరుగుతున్నాయి.
ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించకపోయినా టాలీవుడ్ వర్గాలు సంక్రాంతి పండుగకు విడుదల అవుతుందని గట్టిగా నమ్ముతున్నారు. సంక్రాంతి బరిలో ఇప్పటికే బాలయ్య బాబు వీరసింహారెడ్డి తో ఖర్చీఫ్ వేసుకుని కూర్చున్నాడు. ఈ రెండు సినిమాల మధ్యలో భారీ పోటీ ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఎవరు విన్నర్ గా నిలుస్తారు ? ఎన్ని కోట్ల వసూలు అందుకుంటారు అన్న విషయాలు తెలియాలంటే మరో 40 రోజులు ఆగాల్సిందే.