నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వీర సింహా రెడ్డి మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలకపాత్రలో నటిస్తుంది. దునియా విజయ్ ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. గోపీచంద్ మలినేని ఈ మూవీకి దర్శకత్వం వహిస్తూ ఉండగా , తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్ లో నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ కేవలం ఒక మాట ఒక పాట మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
మరికొన్ని రోజుల్లోనే ఈ పాట షూటింగ్ కూడా మూవీ యూనిట్ పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా అనగా నిన్న బాలకృష్ణ తన తదుపరి మూ వీని స్టార్ట్ చేసిన విషయం మనకు తెలిసింది. ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందబోటుంది. ఈ మూవీ కి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు ఈ సినిమాకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రుపొందుతున్న నేపథ్యంలో ఎన్ బి కే 108 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ ని మొదలుపెట్టారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి చిత్ర బృందం ఒక క్రేజీ టైటిల్ ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. బాలకృష్ణ 108 వ మూవీ కి "బ్రో ఐ డోంట్ కేర్" టైటిల్ ను పెట్టబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.