సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక ట్రెండ్ నడుస్తోంది. అది ఏంటి అంటే ఒక హీరో ఒక దర్శకుడితో సినిమా చేస్తాను అని అనౌన్స్ చేస్తాడు.. దాని తర్వాత దర్శకుడు తో సినిమా చేయడం లేదు అంటూ మరొక ట్రస్ట్ ఇస్తాడు.. అయితే ఇప్పుడు హీరోలు ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు అని చెప్పాలి .సినిమాలో స్టోరీ కి తగ్గట్టు కాంప్రమైజ్ కాలేక మొహమాటలకు పోకుండా సినిమా ప్రకటించిన తర్వాత లేదా సినిమా షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత ఇంకా చెప్పాలి అంటే ఘనంగా సినిమా మొత్తం ప్రారంభించిన తర్వాత ఆ ప్రాజెక్టుని క్యాన్సిల్ చేస్తూ ఉంటారు చాలామంది స్టార్ హీరోలు. అయితే తాజాగా ఈ లిస్టులోకి చేరాడు టాలీవుడ్ హీరో శర్వానంద్. ఒకే ఒక జీవితం సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన ఈయన.
ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ఈ దశలో హిట్ ట్రాక్ను కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు శర్వానంద్. ఇందులో భాగంగానే తన దగ్గరికి వచ్చిన కథలలో మంచి కథలను మాత్రమే ఎంచుకుంటూ మంచి కథలకు ప్రాధాన్యతనిస్తూ పోతున్నాడు.. అందుకే కృష్ణ చైతన్య అనే దర్శకుడుతో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు శర్వానంద్. అనంతరం ఆ సినిమాకి సంబంధించిన పనులు ఘనంగా ప్రారంభించారు. ఇకపోతే ఎంతో ఘనంగా ఈ సినిమా పనులు ప్రారంభించిన తర్వాత శర్వానంద్ మనసు మార్చుకున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా దర్శకుడు కృష్ణ చైతన్య ఈ సినిమా విషయంలో కాన్ఫిడెంట్ గా లేడు అని తెలుస్తోంది.
అందుకే శర్వానంద్ ఈ ప్రాజెక్టును ఆపేశాడని అంటున్నారు. ప్రస్తుతం శర్వానంద్ శ్రీరామ్ ఆదిత్య రాసుకొచ్చిన ఒక కథకి ఓకే చేసినట్లుగా సమాచారం . శ్రీరామ్ అంటే భలే మంచి రోజు శమంతకమణి లాంటి మంచి సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు. అయితే శర్వానంద్ ఇంత బలమైన నిర్ణయం తీసుకోవడానికి ఆ సినిమాలో తోటి నటినట్లు మరియు సీనియర్ స్టార్స్ ప్రధాన కారణం అని తెలుస్తోంది. బుచ్చిబాబుతో తారక్ గౌతం తిననూరితో రామ్ చరణ్ సినిమాలు అనౌన్స్ చేసి వెనక్కి వెళ్లిన సంగతి మనందరికీ తెలిసిందే. టాలీవుడ్ మాత్రమే కాదు ప్రస్తుతం కోలీవుడ్ కూడా ఇదే ట్రెండును ఫాలో అవుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు..!!