మోహన్ లాల్ కి షాక్ ఇచ్చిన ఏనుగు దంతాల కేసు?
అయితే ప్రభుత్వ వైఖరి పై మేజిస్ట్రేట్ కోర్టు చాలా సీరియస్ అయ్యింది.ఇదే పని సామాన్యుల చేస్తే ఇలానే ఊరుకుంటారా అని ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించింది.ఈ క్రమంలో పెరుంబవూరు మెజిస్ట్రేట్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ మోహన్ లాల్ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. తాజాగా ఈ కేసుపై విచారణ చేపట్టింది కేరళ హైకోర్టు. ఇక మోహన్ లాల్ పిటిషన్ను కొట్టివేసింది. పెరుంబవూరు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును కొట్టివేయాలని కోరుతూ నటుడు మోహన్లాల్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడం జరిగింది. దాంతో ఇక మోహన్ లాల్ కు చుక్కెదురైంది.మోహన్ లాల్ జనతా గ్యారేజ్, మనమంతా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అలాగే ఆయన చేసిన మన్యం పులి సినిమా కూడా తెలుగులో మంచి హిట్ కొట్టింది. దాంతో ఆయన సినిమాలు చాలా వరకు తెలుగులో కూడా డబ్ అవుతున్నాయి.