టాలీవుడ్ పరువు తీస్తున్న తారక్, చరణ్ ఫ్యాన్స్?

Purushottham Vinay
హాలీవుడ్లో గత సంవత్సరం ఎన్నో సినిమాలు విడుదలైన బెస్ట్ యాక్షన్ ఫిలిం గా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఆర్ఆర్ఆర్ సినిమాని ప్రకటించింది.అయితే ఈ అవార్డుని  నిజానికి సినిమా ప్రొడ్యూసర్ డివివి దానయ్య అందుకోవాలి కానీ ఆయన రాలేదు కాబట్టి ఆయన స్థానంలో అక్కడికి వెళ్ళిన రామ్ చరణ్ ఇంకా రాజమౌళి తీసుకున్నారు. అయితే ఈ ఘనత కేవలం రామ్ చరణ్ కు ఒక్కడికే దక్కినట్టుగా మెగాస్టార్ చిరంజీవి సహా టాలీవుడ్ లో మెగా హీరోలు ఇంకా కొంతమంది ప్రముఖులు,పవన్ కళ్యాణ్ సైతం రామ్ చరణ్ కు అభినందనలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ విషయంలో ఎన్టీఆర్ అభిమానులు తమ బాధను వ్యక్తం చేస్తూ డైరెక్టర్ రాజమౌళిని టార్గెట్ చేస్తూ రామ్ చరణ్ ని టార్గెట్ చేస్తూ కావాలని మా హీరోని తొక్కేస్తున్నారు అంటూ ఎన్నో రకాల కామెంట్లు చేస్తున్నారు.అయితే ఈ వివాదం మీద హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ కూడా స్పందించింది.

తాము ఎన్టీఆర్ ని పిలిచిన మాట వాస్తవమే కానీ ఆయన ఒక సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు కాబట్టి రాలేకపోయాడని ఆయనకు అందించాల్సిన అవార్డులు అందిస్తామని బాధ పడకండని క్లారిటీ ఇచ్చింది.. అయితే ఇవన్నీ జరగడం వల్ల ఇంటర్నేషనల్ వేదికపై టాలీవుడ్ పరువు పోతుంది. ఎన్టీఆర్ కి ఉన్న పరిస్థితిల కారణంగా ఆయన అమెరికాకి వెళ్లలేకపోయాడు. అక్కడికి వెళ్లిన రామ్ చరణ్ ని హైలైట్ చేస్తూ మెగా అభిమానులు మా హీరో గొప్ప అంటూ పోస్టులు పెడుతున్నారు. చాలా మంది ప్రముఖులు కూడా రామ్ చరణ్ ని హాలీవుడ్ వేదికపై తెలుగు హీరోగా మిగతా హాలీవుడ్ నటినటులకు అవార్డులు అందజేస్తున్నందుకు కంగ్రాట్స్ తెలుపుతున్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం మా హీరో గొప్ప అంటూ చాలా చెత్త చెత్తగా ట్రోల్ చేస్తూ హాలీవుడ్ లో టాలీవుడ్ పరువుని తీస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: