ఎన్టీఆర్ 30 నుంచి లీక్ అయిన మరో డైలాగ్...!!

murali krishna
ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో సినిమా 2024 సంవత్సరం ఏప్రిల్ నెల 5వ తేదీ న థియేటర్లలో విడుదల కానుందట.. మరో 11 నెలల్లో విడుదల కానున్న ఈ సినిమా ప్రతి సన్నివేశం కూడా స్పెషల్ గా ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
అయితే ఈ సినిమా డైలాగ్ గతం లో ఒకటి లీకై నెట్టింట బాగా వైరల్ అయింది. "యుద్ధం తథ్యం అయితే కత్తి కన్నీళ్లు పెట్టినా కనికరించకు" అనే డైలాగ్ రెండు వారాల క్రితం సోషల్ మీడియా లో బాగా హాట్ టాపిక్ అయింది.
అయితే తాజాగా ఈ సినిమా కు సంబంధించి మరో డైలాగ్  కూడా లీక్ కాగా ఆ డైలాగ్ తెగ వైరల్ అవుతుండటం విశేషం.ఎన్టీఆర్30 సినిమాలో తారక్ సముద్రవీరుడి గా కనిపించనున్నారని తెలుస్తుంది. "సమయం యుద్ధాన్ని కోరినప్పుడు ప్రకృతి తన సారథిని పంపిస్తుంది.. ప్రకృతి కోరలను బలిచ్చే ధీరుని ప్రచండ దాడికి సిద్ధం" అనే డైలాగ్ ఈ సినిమా నుంచి వైరల్ అవుతుండం విశేషం.. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో ఈ సినిమా షూట్ శరవేగంగా అయితే జరుగుతోంది. ఎన్టీఆర్30 నుంచి లీకవుతున్న ప్రతి డైలాగ్ కూడా సినిమా పై అంచనాలను రెట్టింపు చేస్తోంది. ఈ డైలాగ్ లను ఎన్టీఆర్ నోటి నుంచి వింటే మామూలు గా ఉండదని కొంతమంది ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జాన్వీ కూడా కొత్త యాసలో డైలాగ్స్ చెబుతుందని తెలుస్తుంది. ఎన్టీఆర్ జాన్వీ జోడీ సీనియర్ ఎన్టీఆర్ శ్రీదేవి స్థాయి లో పేరు సంపాదించుకోవడం ఖాయమ ని కొంతమంది కామెంట్లు కూడా చేస్తున్నారు. ఎన్టీఆర్ జాన్వీ జోడీ బ్లాక్ బస్టర్ జోడీ అనిపించుకుంటుందో లేదో చూడాలి.. ఈ జోడీ సూపర్ జోడీ అని కొంతమంది కామెంట్లు కూడా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: