బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న
కత్రినా కైఫ్ టాలీవుడ్ లో సైతం తనకంటూ ఒక మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.బాలీవుడ్ స్టార్
హీరోయిన్ కత్రినా కైఫ్ అంటే తెలుగు ప్రేక్షకులకు సైతం ఇష్టమే.
వెంకటేష్ హీరోగా నటించిన
మల్లీశ్వరి తో పాటు
బాలకృష్ణ హీరోగా నటించిన అల్లరి పిడుగు సినిమాలో సైతం నటించింది ఈమె. ఇక అలాంటి ఒక
హీరోయిన్ ప్రస్తుతం
బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. గతంలో స్టార్ హీరోల సరసన నటించడానికి ఈమె పలు కండిషన్లను పెట్టినట్లుగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఆ కండిషన్లు విని దర్శక నిర్మాతలు సైతం షాక్ అయ్యారు.
ఇక అసలు విషయం ఏంటంటే
కత్రినా కైఫ్ వెంకటేష్ కలిసి నటించిన
మల్లీశ్వరి సినిమా ఇప్పటికీ అందరికీ గుర్తుంది.ఈ
సినిమా ఇప్పటికీ టీవీలో వస్తే సినీ ప్రియులు టీవీలకు అతుక్కుంటారు. ఇక ఈ సినిమాలో వీరిద్దరి నటన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ సినిమాలో నటించేందుకు
కత్రినా నిర్మాత
సురేష్ బాబుకు కొన్ని కండిషన్స్ పెట్టిందట. అవేంటంటే తనతో వచ్చే తన అసిస్టెంట్లకి కూడా స్పెషల్ రూమ్స్ ఇవ్వాలట.. అంతేకాదు తనలాగే అన్ని సౌకర్యాలను వాళ్లకి కల్పించాలట. వాటితో పాటు రెమ్యూనరేషన్ సైతం భారీగా ఇస్తేనే ఆ సినిమాలో నటిస్తాను అంటూ చెప్పిందట కత్రినా.
బాలీవుడ్
హీరోయిన్ కావడంతో
సురేష్ బాబు సైతం అన్ని కండిషన్లకు ఒప్పుకున్నాడట. అన్ని కండిషన్లకు ఒప్పుకున్నప్పటికీ ఆఖరిలో షూటింగ్ సమయంలో హీరోలకి దర్శకులకి సహకరించలేదట కత్రినా.
రొమాంటిక్ సన్నివేశాలలో సైతం సరిగా నటించలేదు. ఆమె ప్రవర్తన చూసి
వెంకటేష్ సైతం విసిగిపోయాడు. అంతేకాదు అనవసరంగా కత్రినాను ఈ సినిమాలో తీసుకున్నాము అని బాధపడ్డారట. అంతేకాదు షూటింగ్ వదిలేసి ఇంటికి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. కానీ
సురేష్ బాబు ఇలాగైనా సరే ఈ
సినిమా పూర్తి చేయాలని పేమెంట్ మొత్తం ఇచ్చి ఈ సినిమాను పూర్తి చేయించారట..!!